ETV Bharat / state

రాయలసీమ ప్రజలుగా... సీఎంకు రుణపడి ఉంటాం - కర్నూలుకు హైకోర్టును ఇవ్వటంపై కడప వైకాపా నేతలు సంబరాలు

మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి సరైన నిర్ణయం తీసుకున్నారంటూ కడపలోని వైకాపా నేతలు.. బాణసంచా కాలుస్తూ హర్షం వ్యక్తం చేశారు. కర్నూలుకు హైకోర్టును కేటాయించినందుకు...తాము సీఎంకు రుణపడి ఉంటామని రాయలసీమ ప్రజలు అన్నారు.

kadapa ycp members celebrate for 3 capitals announcement by government
సీఎంకు రాయలసీమ ప్రజలుగా రుణపడి ఉంటాం
author img

By

Published : Jan 20, 2020, 11:18 PM IST

సీఎంకు రాయలసీమ ప్రజలుగా రుణపడి ఉంటాం

మూడు రాజధానుల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని వైకాపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. కర్నూలుకు హైకోర్టును తీసుకొచ్చినందుకు రాయలసీమ ప్రజలు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారని.. వైకాపా నేత అహ్మద్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కడప ఏడురోడ్ల కూడలిలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం లోటు బడ్జెట్​లో ఉందని... అమరావతిని అభివృద్ధి చేస్తే లక్షల కోట్లు వెచ్చించాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:

అసెంబ్లీ నుంచి తెదేపా సభ్యుల సస్పెన్షన్

సీఎంకు రాయలసీమ ప్రజలుగా రుణపడి ఉంటాం

మూడు రాజధానుల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని వైకాపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. కర్నూలుకు హైకోర్టును తీసుకొచ్చినందుకు రాయలసీమ ప్రజలు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారని.. వైకాపా నేత అహ్మద్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కడప ఏడురోడ్ల కూడలిలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం లోటు బడ్జెట్​లో ఉందని... అమరావతిని అభివృద్ధి చేస్తే లక్షల కోట్లు వెచ్చించాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:

అసెంబ్లీ నుంచి తెదేపా సభ్యుల సస్పెన్షన్

అభివృద్ధి వికేంద్రీకరణ లో భాగంగా అసెంబ్లీలో మూడు రాజధానులు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం కావడంతో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి లోని నాలుగు రోడ్ల కూడలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి స్థానిక ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఒకరికొకరు జై జగన్ అంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైయస్సార్ సిపి పార్టీ నాయకులు మాజీ ఎంపిపి రవి కుమార్ రెడ్డి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి వైయస్సార్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...
Byte- 1-కల్లూరు చంద్రబాబు రెడ్డి- మండల కన్వీనర్ వైఎస్సార్సీపీ -వేంపల్లి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.