ETV Bharat / state

"పాలకులు మారినా.. మా బతుకులు మారలేదు" - updates of girijana people

దేశం అభివృద్ధి చెందుతున్నా... ఇప్పటికీ గిరిజనుల బతుకులు మారటం లేదు. ప్రపంచమంతా దూసుకెళ్తున్నా గిరిజనులు మాత్రం అక్కడే ఉండిపోతున్నారు. తినటానికి తిండి లేక.. చదువుకోవటానికి పాఠశాలలు లేక ఆ పసి హృదయాలు తల్లడిల్లుతున్నాయి. ఉండేందుకు కనీసం గూడు కూడా లేక నరకం అనుభవిస్తున్నారు. పేరుకు మాత్రమే అది ఊరు... కనీస సౌకర్యాలైన గుడి, బడి, రోడ్లు, ఆసుపత్రులు ఏమీ లేవు. ఇది ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని సిద్ధేశ్వరపురం పరిస్థితి !

girijina people problems in kadapa
గిరిజన ప్రజల కష్టాలు
author img

By

Published : Dec 17, 2019, 12:27 PM IST

పార్టీలు మారినా, పాలకులు మారినా, గిరిజనులు బతుకులు మారటం లేదు. కడప జిల్లాలోని కండ్రిక పంచాయితి పరిధి అయిన సిద్దేశ్వరపురం గత 25సంవత్సరాలుగా అభివృద్దికి నోచుకోక గుడిసెలకే పరిమితమైంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. ఇక్కడి పిల్లలు స్కూల్​కు వెళ్లాలంటే పక్కూరుకు పోవాల్సిందే. వర్షాకాలం గుడిసెలు కూలిపోతాయోమోనని.. ఎండాకాలం ఎక్కడ నిప్పుంటుకుని తగలడిపోతాయోమో అని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు అక్కడి గిరిజనులు. 60ఏళ్లు నిండినా పింఛన్ రాదు. ఎందుకంటే వారికి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు సైతం లేవు. ప్రభుత్వ పెద్దలు కరుణించి ఇల్లు కట్టించి, గ్రామంలో రోడ్డు వేయాలని వీరు కోరుకుంటున్నారు.

అభివృద్ధికి పట్టం కడుతున్నామనే పాలకుల వాగ్దానాలు వీరి విషయంలో మాటలకే పరిమితమయ్యాయి. పేదవారికి అండగా ఉంటామన్న నాయకులు ఊరి పొలిమేరలోనే ఆగిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తే వారి బతుకుల్లో వెలుగులు నింపిన వారవుతారని స్థానికులు అంటున్నారు.

గిరిజన ప్రజల కష్టాలు

ఇదీ చూడండి దిల్లీ 'జామియా' ఘటనలో 10 మంది అరెస్టు

పార్టీలు మారినా, పాలకులు మారినా, గిరిజనులు బతుకులు మారటం లేదు. కడప జిల్లాలోని కండ్రిక పంచాయితి పరిధి అయిన సిద్దేశ్వరపురం గత 25సంవత్సరాలుగా అభివృద్దికి నోచుకోక గుడిసెలకే పరిమితమైంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. ఇక్కడి పిల్లలు స్కూల్​కు వెళ్లాలంటే పక్కూరుకు పోవాల్సిందే. వర్షాకాలం గుడిసెలు కూలిపోతాయోమోనని.. ఎండాకాలం ఎక్కడ నిప్పుంటుకుని తగలడిపోతాయోమో అని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు అక్కడి గిరిజనులు. 60ఏళ్లు నిండినా పింఛన్ రాదు. ఎందుకంటే వారికి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు సైతం లేవు. ప్రభుత్వ పెద్దలు కరుణించి ఇల్లు కట్టించి, గ్రామంలో రోడ్డు వేయాలని వీరు కోరుకుంటున్నారు.

అభివృద్ధికి పట్టం కడుతున్నామనే పాలకుల వాగ్దానాలు వీరి విషయంలో మాటలకే పరిమితమయ్యాయి. పేదవారికి అండగా ఉంటామన్న నాయకులు ఊరి పొలిమేరలోనే ఆగిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తే వారి బతుకుల్లో వెలుగులు నింపిన వారవుతారని స్థానికులు అంటున్నారు.

గిరిజన ప్రజల కష్టాలు

ఇదీ చూడండి దిల్లీ 'జామియా' ఘటనలో 10 మంది అరెస్టు

Intro:కడప జిల్లా రైల్వే కోడూరు మండలం లోని VPR కండ్రిక పంచాయతీ పరిధిలోని సిద్దేశ్వర పురం గిరిజన కాలని స్థితిగతులపై టీవీ కథనం .
భారతదేశంలో గిరిజనులు అనేక గ్రామాల్లో ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేక ఇబ్బందులు పడుతున్న వాస్తవ పరిస్థితి . పార్టీలు మారినా, పాలకులు మారిన, గిరిజనులు గిరిజన గ్రామాలను అభివృద్ధికి ఇప్పటికీ నోచుకోలేదు. ఆ గ్రామాల్లోని ప్రజలు ముందుకు వచ్చి మా గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని రాజకీయ నాయకులు గానీ అధికారులు గాని అడిగేందుకు వెనుక పడడం వీటికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మీడియా ప్రతినిధులు ఆ గ్రామాలకు వెళ్లిన ఆ గ్రామాల్లోని ప్రజలు ముందుకు వచ్చి మాట్లాడేందుకు జంకుతున్నారు. అయితే గ్రామాలను దగ్గరలో చూస్తూ ఉన్నా రాజకీయ నాయకులు గానీ అధికారులు గాని ఆ గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలు రోడ్డు, విద్యా ,వైద్యం వారికి కల్పించడం లేదు.


Body:vpr కండ్రిక పంచాయతీ పరిధిలోని సిద్దేశ్వర పురం గిరిజన గ్రామం గత 25 సంవత్సరములకు పైగా అక్కడ గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామంలోని అందరూ చుట్టుపక్కల పొలాల్లోకి కూలి పనులు చేసుకుంటూ వారు తమ జీవన ప్రయాణం సాగిస్తున్నారు. ఆ గ్రామాల్లో చదువుకున్న వారు చాలా తక్కువ. ఆ గ్రామం నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న vpr కండ్రిక గ్రామానికి పోయి చదువుకో వలసి ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు బడికి పోలేని పరిస్థితి. ఆ గ్రామంలో ఇప్పటికి రోడ్డు గాని సరైన మౌలిక సదుపాయాలు ఇప్పటికి కల్పించలేదు. ఆ గ్రామంలోని కొందరికి పెన్షన్లు, రేషన్ కార్డులు, లేవని తెలిపారు. మురికి గుంటలు దగ్గరలో ఉన్నందువల్ల దోమలు ఎక్కువగా ఉంటున్నాయని వాటి వల్ల జ్వరాలు అనేక రకాల జబ్బులకు బాధపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇల్లు కట్టుకోవాలని కాలనీలు మంజూరు చేసినా వారు ఇళ్ళు కట్టుకోలేని పరిస్థితి. కూలినాలి చేసుకునే మాకు ఇల్లు కట్టుకో లేని స్థితి ఉన్నందువల్ల ఈ గుడిసెలోనే కాలం వెల్లదీస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు కరుణించి ఇల్లు కట్టించి, గ్రామములో రోడ్డు వేస్తే బాగుంటుందని తెలిపారు. గ్రామంలో బోరు చెడిపోయిన అప్పుడు పొలాల్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి ఉంటుందని, అందువల్ల వారి గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాలు వెంటనే ప్రభుత్వం కల్పించాలని వేడుకున్నారు.

బైట్స్.
1.నాగమ్మ, స్థానిక మహిళ
2. అనంతమ్మ, స్థానిక మహిళ
3. హరి , గ్రామస్తుడు
4. శంకర , గ్రామస్తుడు
5. సుబ్బరాయుడు, గ్రామస్తులు


Conclusion:ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు గిరిజన గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.