మీరు చూస్తున్న ఈ ఇంటికి ఓ అపురూపమైన చరిత్ర ఉంది. జాతికి స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టిన మహాత్మాగాంధీ... దేశ పర్యటనలో భాగంగా కడపకు వచ్చారు. 1933 సంవత్సరంలో 3 రోజులపాటు ఈ ఇంట్లోనే బస చేశారు. గాంధీ తమ పట్టణానికి వచ్చాడని తెలుసుకున్న ప్రజలు... చూసేందుకు భారీగా తరలివచ్చారు. 1929లో అప్పటి స్వాతంత్య్ర సమరయోధుడు దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి ఈ ఇల్లును కడప ఏడురోడ్ల కూడలి వద్ద నిర్మించారు.
ఆ పర్యటనలో గాంధీజీ... కడపలోని హరిజన వాడను సందర్శించారు. విరాళాలు కూడా సేకరించారని అప్పటి స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 3రోజుల పాటు కడపలో ఉండి... ఇక్కడి రైల్వేస్టేషన్ వెళ్లి... రేణిగుంట వెళ్లినట్లు చెబుతున్నారు. గాంధీ కడపకు వచ్చినప్పుడు... తన చిత్రపటంపై స్వయాన సంతకం చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆ చిత్రాన్ని ఇప్పటికీ సదరు ఇంటి యజమానులు భద్రంగా దాచిపెట్టారు. ఇంటికి కడప గాంధీ అని పేరు రావడం సంతోషంగా ఉందని దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి తనయుడు హరికిషోర్ రెడ్డి సంబరపడుతున్నారు.