ETV Bharat / state

యువకుడి అత్యాచారం.. మైనర్ ఆత్మహత్య

author img

By

Published : Dec 16, 2019, 3:24 PM IST

పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం వీరభద్రవరం గ్రామంలో ఓ బాలిక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ప్రియుడికి తెలుపగా ఆమెను తిట్టి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

minor suicide in t. narasapuram west godavari district
యువకుడి అత్యాచారం.. మైనర్ ఆత్మహత్య
యువకుడి అత్యాచారం.. మైనర్​ ఆత్మహత్య

పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం వీరభద్రవరం గ్రామంలో పురుగుల మందు తాగి ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి కారకులైన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదైంది. గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి బాలిక ఈనెల 7న భజనకు వెళ్లి తిరిగి వస్తుండగా.. అదే గ్రామానికి చెందిన మానికల రాజు అత్యాచారం చేశాడు.

ఆత్మహత్యకు ఉసిగొల్పిన ప్రియుడు

ఈ విషయాన్ని ఆమె ప్రియుడు సుబ్రహ్మణ్యంకు చెప్పింది. అతను ఆమెను తిట్టి.. చెడిపోయావంటూ శీతల పానీయంలో పురుగుల మందు కలిపి ఇచ్చి బాలిక ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొల్పాడు. శీతల పానీయం సేవించిన బాలిక పాఠశాలకు వెళ్లి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన ఉపాధ్యాయులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి బంధువులకు సమాచారమిచ్చారు. గురువారం బాలిక పరిస్థితి విషమించడం వల్ల గుంటూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజు, సుబ్రహ్మణ్యం లను అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

విదేశీ ఫలాలు.. ఆరోగ్యానికి సోపానాలు..!

యువకుడి అత్యాచారం.. మైనర్​ ఆత్మహత్య

పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం వీరభద్రవరం గ్రామంలో పురుగుల మందు తాగి ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి కారకులైన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదైంది. గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి బాలిక ఈనెల 7న భజనకు వెళ్లి తిరిగి వస్తుండగా.. అదే గ్రామానికి చెందిన మానికల రాజు అత్యాచారం చేశాడు.

ఆత్మహత్యకు ఉసిగొల్పిన ప్రియుడు

ఈ విషయాన్ని ఆమె ప్రియుడు సుబ్రహ్మణ్యంకు చెప్పింది. అతను ఆమెను తిట్టి.. చెడిపోయావంటూ శీతల పానీయంలో పురుగుల మందు కలిపి ఇచ్చి బాలిక ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొల్పాడు. శీతల పానీయం సేవించిన బాలిక పాఠశాలకు వెళ్లి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన ఉపాధ్యాయులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి బంధువులకు సమాచారమిచ్చారు. గురువారం బాలిక పరిస్థితి విషమించడం వల్ల గుంటూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజు, సుబ్రహ్మణ్యం లను అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

విదేశీ ఫలాలు.. ఆరోగ్యానికి సోపానాలు..!

Reporter. Nagaraju Centure. Chintalapudi. Fele. Ap_tpg_10_16_minior_mruthi_avb_ap_10182 . యాంకర్ వాయిస్. పశ్చిమగోదావరి జిల్లా టీ నరసాపురం మండలంలో ఓ మైనర్ బాలిక మృతి కలకలం రేపింది. వాయిస్ ఓవర్.. పశ్చిమగోదావరి జిల్లా టీ నరసాపురం వీరభద్రంవరం గ్రామంలో గత శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బొర్రెంపాలెం ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని శుక్రవారం మధ్యాహ్నం తరగతి గదులోనే వాంతులు చేసుకుంది. ఉపాధ్యాయులు వెంటనే బాలిక తల్లికి సమాచారం అందించారు. స్థానిక వైద్యుడి తో చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి గుంటూరు తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో బాలిక మృతి చెందింది. అయితే బాలిక తల్లి తెలిపిన వివరాల మేరకు అదే గ్రామానికి చెందిన సుబ్రమణ్యం అనే యువకుడి తో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాలిక గత గురువారం రాత్రి భజనకు వెళ్లి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన మానికల రాజు అనే యువకుడు బాలికపై అత్యాచారం చేశాడని తల్లి చెబుతోంది. ఈ విషయాన్ని బాలిక శుక్రవారం తన స్నేహితుడు సుబ్రహ్మణ్యం తో చెప్పగా అతడు నీవు చెడిపోయావు నీవు చనిపోవాలంటూ బాలికపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నీవు నన్ను నిజంగా ప్రైమిస్తే పురుగుల మందు తాగాలని బాలికలకు ఇచ్చాడు. ఆ పురుగుల మందు తాగి బాలిక పాఠశాల కు వెళ్లి అక్కడ నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషయాన్ని గ్రామంలో కొంతమంది వ్యక్తులు సెటిల్ మెంట్ చేయాలని సూచించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతి దేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమతో పాటు కలిసి చదువుతున్న విద్యార్థిని చనిపోయినట్లు తెలియడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 1. ఉపాధ్యాయిని. 2. బాలిక తల్లి. నోట్.. విజువల్ వాట్సాప్ లో పంపాను పరిశీలించగలరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.