ETV Bharat / state

మద్యానికి భార్య డబ్బు ఇవ్వలేదని భర్త ఆత్మహత్య - విశాఖ మన్యంలో మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య

మద్యానికి భార్య డబ్బు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖమన్యం పెదబయలు మండలంలో జరిగింది.

The incident in which a man committed suicide for not paying for the liquor
విశాఖ మన్యంలో మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య
author img

By

Published : Dec 29, 2019, 10:22 AM IST

Updated : Dec 29, 2019, 10:43 AM IST

విశాఖ మన్యంలో మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య

విశాఖ మన్యం పెదబయలు మండలం అర్లాబులో ఓ వ్యక్తి... భార్య డబ్బులు ఇవ్వలేదని మనస్తాపం చెంది పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుట్టన్న అనే వ్యక్తి మద్యానికి భార్యను డబ్బులు అడిగాడు. ఆమె లేవని చెప్పి పొలం పనికి వెళ్ళిపోయింది. మనస్తాపం చెందిన అతను పురుగుల మందు తాగాడు. కుమారుడు ఇంటికి వచ్చి చూసేసరికి తండ్రి పడిపోయి ఉన్నాడు. వెంటనే ఈ విషయాన్ని అతని తల్లికి తెలియజేశాడు. పెదబయలు నుంచి పాడేరు ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

విశాఖ మన్యంలో మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య

విశాఖ మన్యం పెదబయలు మండలం అర్లాబులో ఓ వ్యక్తి... భార్య డబ్బులు ఇవ్వలేదని మనస్తాపం చెంది పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుట్టన్న అనే వ్యక్తి మద్యానికి భార్యను డబ్బులు అడిగాడు. ఆమె లేవని చెప్పి పొలం పనికి వెళ్ళిపోయింది. మనస్తాపం చెందిన అతను పురుగుల మందు తాగాడు. కుమారుడు ఇంటికి వచ్చి చూసేసరికి తండ్రి పడిపోయి ఉన్నాడు. వెంటనే ఈ విషయాన్ని అతని తల్లికి తెలియజేశాడు. పెదబయలు నుంచి పాడేరు ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

ఇవీ చదవండి

భార్యను చంపిన భర్త... అనుమానమే కారణమా..?

సెంటర్: పాడేరు. శివ ఫైల్: ap_vsp_79_28_madyam_kosam_atmahatya_vo_ap10082 .............. యాంకర్: మద్యం అలవాటుతో ప్రాణాలే ఫణంగా పెడుతున్నారంటే తాగుడుకు ఎంత బానిస అవుతున్నారా ఈ సంఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. వాయిస్: విశాఖ మన్యం పెదబయలు మండలం అర్లాబులో ఓ వ్యక్తి భార్య డబ్బులు ఇవ్వలేదని మనస్తాపం చెంది పురుగులు మందు సేవించి మృత్యువాత పడ్డాడు. బుట్టన్న అనే వ్యక్తి మద్యంనకు భార్యను డబ్బులు అడిగాడు. ఆమె డబ్బుల్లేవని పొలం పనికి వెళ్ళిపోయింది. పురుగుల మందు సేవించి పడిపోయాడు. కుమారుడు ఇంటికీ వచ్చి చూసేసరికి తండ్రి పడిపోయిఉన్నాడు. పరుగున వెళ్లి అమ్మకు చెప్పాడు. పెదబయలు నుంచి పాడేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం లో మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. మాయదారి తాగుడు కోసం తనువు చాలించాలా అంటూ బంధువులు ఎద్దేవా చేస్తున్నారు. శివ, పాడేరు
Last Updated : Dec 29, 2019, 10:43 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.