ETV Bharat / state

ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులపై జనసేన లాంగ్​మార్చ్‌

author img

By

Published : Nov 3, 2019, 4:28 PM IST

Updated : Nov 3, 2019, 4:34 PM IST

రాష్ట్రంలో ఇసుక కొరతపై జనసేనాని విశాఖలో తలపెట్టిన లాంగ్​మార్చ్​ మొదలైంది. పవన్ అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. పవన్ కల్యాణ్ తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి మార్చ్​ ప్రారంభించారు.

జనసేన లాంగ్​ మార్చ్

విశాఖలో జనసేన లాంగ్​మార్చ్‌

భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేపట్టిన లాంగ్‌మార్చ్‌ ప్రారంభమైంది. రాష్టంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మద్దిలపాలెంలోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పవన్‌ లాంగ్‌మార్చ్‌ను ప్రారంభించారు. ఈ లాంగ్‌మార్చ్‌ రామాటాకీస్‌, ఆశీల్‌మెట్ట జంక్షన్‌ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగనుంది. ఈ ర్యాలీకి తెదేపా మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ తరఫున సీనియర్‌ నేత అచ్చెన్నాయుడు తదితరులు ఈ లాంగ్‌మార్చ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు, భవన నిర్మాణ కార్మికులు తరలివచ్చారు.

Intro:Body:Conclusion:
Last Updated :Nov 3, 2019, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.