భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో జనసేన అధినేత పవన్కల్యాణ్ చేపట్టిన లాంగ్మార్చ్ ప్రారంభమైంది. రాష్టంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మద్దిలపాలెంలోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పవన్ లాంగ్మార్చ్ను ప్రారంభించారు. ఈ లాంగ్మార్చ్ రామాటాకీస్, ఆశీల్మెట్ట జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగనుంది. ఈ ర్యాలీకి తెదేపా మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ తరఫున సీనియర్ నేత అచ్చెన్నాయుడు తదితరులు ఈ లాంగ్మార్చ్లో పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు, భవన నిర్మాణ కార్మికులు తరలివచ్చారు.
ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులపై జనసేన లాంగ్మార్చ్
రాష్ట్రంలో ఇసుక కొరతపై జనసేనాని విశాఖలో తలపెట్టిన లాంగ్మార్చ్ మొదలైంది. పవన్ అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. పవన్ కల్యాణ్ తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి మార్చ్ ప్రారంభించారు.
భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో జనసేన అధినేత పవన్కల్యాణ్ చేపట్టిన లాంగ్మార్చ్ ప్రారంభమైంది. రాష్టంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మద్దిలపాలెంలోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పవన్ లాంగ్మార్చ్ను ప్రారంభించారు. ఈ లాంగ్మార్చ్ రామాటాకీస్, ఆశీల్మెట్ట జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగనుంది. ఈ ర్యాలీకి తెదేపా మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ తరఫున సీనియర్ నేత అచ్చెన్నాయుడు తదితరులు ఈ లాంగ్మార్చ్లో పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు, భవన నిర్మాణ కార్మికులు తరలివచ్చారు.