విశాఖలోని ఆంధ్రా వర్సిటీలో ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఆటలపోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన పాఠశాలల నుంచి 1200 మంది విద్యార్థిని, విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. బాలబాలికలకు వేర్వేరుగా మూడు కేటగిరీల్లో ఈ పోటీలు నిర్వహించారు. కబడ్డీ, రన్నింగ్, ఆర్చరీ వంటి ఆటల్లో చిన్నారులు పోటీపడ్డారు. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో... పోటీలు నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. రేపటి ముగింపు పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఇవీ చూడండి...గురుకుల పాఠశాలలో రాష్ట్రస్థాయి ఆటల పోటీలు