శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీ జరిగింది. కలెక్టర్ నివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో సభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఉద్ఘాటించారు. బలహీన వర్గాలపై దాడులు హేయమైన చర్య అనీ, భవిష్యత్తులో దాడులు పునరావృతం కాకూడదని అధికారులకు సూచించారు. లా అండ్ ఆర్డర్ను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: 'ప్లాస్టిక్ నిషేధించాలని అవగాహన ర్యాలీ'