ETV Bharat / state

ఉల్లి కోసం.. ఎన్ని కష్టాలో..!

author img

By

Published : Dec 16, 2019, 11:41 PM IST

దేశం మొత్తం ఎక్కడ చూసినా... ఒకటే లోల్లి ''ఉల్లి''. ఒకప్పుడు ఉల్లిపాయలు కోస్తే కన్నీరు వచ్చేది..కానీ నేడు కొనాలంటే కన్నీళ్లు రావడం కాదు..రాయితీ ఉల్లి కోసం వేచి చూసి కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉన్న ఫలితంగా గంటల తరబడి ప్రజలు లైన్​లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

people suffaring for onion at srikakulam district
ఉల్లి కోసం.. క్యూ కట్టి.. కన్నీళ్లు పెట్టి..
ఉల్లి కోసం.. క్యూ కట్టి.. కన్నీళ్లు పెట్టి..

ఉల్లి ధరల పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోంది. బహిరంగ మార్కెట్​లో ఉల్లి ధర తారస్థాయికి చేరిన కారణంగా.. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. రైతు బజార్లు, మార్కెట్​ యార్డుల్లో రాయితీపై కిలో ఉల్లిపాయలు 25 రూపాయలకే విక్రయిస్తోంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రాయితీపై విక్రయాలు ప్రారంభించారు.

కిలో ఉల్లిపాయలు 25 రూపాయలకే విక్రయిస్తుండడంతో రాత్రి, పగలు, చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో వినియోగదారులు బారులు తీరుతున్నారు. ఇలాంటి సమయంలో అధికారులు ఉల్లి అమ్మకాల్లో వివక్ష చూపుతున్నారని వినియోగదారులు బోరున విలపిస్తున్నారు. ఉల్లి పంపిణీలో అధికారుల పర్యవేక్షణ శూన్యమనే చెబుతున్నారు వినియోగదారులు. నామమాత్రంగా కౌంటర్లు నిర్వహిస్తుండటంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. దీంతో వాలంటీర్ల ద్వారా ఉల్లి పంపిణీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

అధికారులు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాలంటీర్ల ద్వారా సరైన ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి

రాయితీ ఉల్లి కోసం ప్రజల బారులు

ఉల్లి కోసం.. క్యూ కట్టి.. కన్నీళ్లు పెట్టి..

ఉల్లి ధరల పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోంది. బహిరంగ మార్కెట్​లో ఉల్లి ధర తారస్థాయికి చేరిన కారణంగా.. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. రైతు బజార్లు, మార్కెట్​ యార్డుల్లో రాయితీపై కిలో ఉల్లిపాయలు 25 రూపాయలకే విక్రయిస్తోంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రాయితీపై విక్రయాలు ప్రారంభించారు.

కిలో ఉల్లిపాయలు 25 రూపాయలకే విక్రయిస్తుండడంతో రాత్రి, పగలు, చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో వినియోగదారులు బారులు తీరుతున్నారు. ఇలాంటి సమయంలో అధికారులు ఉల్లి అమ్మకాల్లో వివక్ష చూపుతున్నారని వినియోగదారులు బోరున విలపిస్తున్నారు. ఉల్లి పంపిణీలో అధికారుల పర్యవేక్షణ శూన్యమనే చెబుతున్నారు వినియోగదారులు. నామమాత్రంగా కౌంటర్లు నిర్వహిస్తుండటంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. దీంతో వాలంటీర్ల ద్వారా ఉల్లి పంపిణీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

అధికారులు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాలంటీర్ల ద్వారా సరైన ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి

రాయితీ ఉల్లి కోసం ప్రజల బారులు

AP_SKLM_03_07_ONIONS_NO_STOCK_PKG_AP10172 FROM:- CH.ESWARA RAO, SRIKAKULAM. CAMERA MAN:- CHINNA REDDY, SRIKAKULAM. DEC 07 ------------------------------------------------------------------------------ NOTE:- AP_SKLM_03_07_ONIONS_NO_STOCK_PKG_VIS_2_AP10172 ఈ ఫైల్‌లో సరిహద్దు విజవల్స్‌ డెస్క్‌ వాట్సాప్‌కు పంపించాను. తీసుకోగలరు. --------------------------------------------------------- యాంకర్:- ఉల్లిపాయల ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తు న్నాయి. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తు న్నాయి. అయితే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉల్లి పక్కదారి పడుతోంది. ఆంధ్రా నుంచి అక్రమంగా లారీలను ఒడిశాకు తరలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిపాయలు 25 రుపాయలకు రాయితీపై విక్రయాలు చేపడుతున్నప్పటికీ.. అవి చాలిచాలని పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలో రైతు బజార్లల్లో ఉదయం నుంచి రాత్రి వరకు గంటల తరబడి బారులు తీరినా దొరుకుతా యన్న నమ్మకం లేకుండా పోయింది. దీంతో ఉల్లి ఘాటులేకపోయినా సిక్కోలు వాసులు కన్నీటి పర్యంతమౌతున్నారు.....(Look). VO.1:- శ్రీకాకుళం జిల్లాలో ఉల్లిపాయ ధరలు రోజురోజుకు పెరుగుతూ వస్తుండడంతో ధరలు చుక్కలను తాకుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి 105 నుంచి 120 వరకు ప్రస్తుతం పలుకుతోంది. ఉల్లి రకాల ఆధారంగా ధరలను నిర్ణయించి విక్రయాలు చేపడుతున్నారు. వ్యాపారుల వద్ద ఉన్న సరకు ఆధారంగా ఉల్లి ధరలు వారే నిర్ణయిస్తున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు కొను గోలు చేయలేని దుస్థితి నెలకొంది. మార్కెట్‌లో ఉల్లి ధర ఎంత ఉందో తెలుసుకుని కొనుగోలు చేయకుండా ఇంటి ముఖం పట్టిన వారు ఉంటున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. శ్రీకాకుళం, ఆమదాలవలస, కోటబోమ్మాళి రైతు బజార్లల్లో రాయితీపై కిలో ఉల్లిపాయలు 25కే విక్రయాలు జరుగుతుండడంతో కొంతవ రకు వినియోగదారులకు ఊరట కలుగుతోంది. దీంతో వినియోగదారులు ఉదయం నుంచి రాత్రి వరకు గంటల తరబడి బారులు తీరుతున్నారు. ఇలా క్యూలో నిలుచున్నా ఈ మధ్య దొరుకుతా యన్న నమ్మకం లేకుండా పోయింది. శ్రీకాకుళం రైతుబజారులో శుక్రవారం నాటికి ఉల్లిపాయలు నిండుకోవడంతో విక్రయాలు జరగలేదు. శనివారం వచ్చిన లారీ వచ్చినట్లే గంటల వ్యవధిలో ఖాళీ అయ్యిపోయాయి. ఉల్లి అమ్మకాల్లో వివక్ష చూపుతున్నారని వినియోగదారులు బోరునవిలపిస్తున్నారు....(Bytes). బైట్స్‌:- వినియోగదారులు, శ్రీకాకుళం. VO.2:- జిల్లా స్థాయి ధరల నియంత్రణ కమిటీ ధరలు అదుపు తప్పినపుడు సమావే శం నిర్వహించాలి. మార్కెట్ ధరలపై ఆయా సంఘాలు, కమిటీ ప్రతినిధు లతో సమావేశమై ధరల నియంత్రణ బాధ్యతలు చేపట్టాలి. గత నెల రోజులుగా ధరల వ్యత్యాసం ఉన్నప్పటికీ కమిటీ కనీసం ఒక్క సమావేశం కూడా నిర్వహించిన దాఖలాలు కని పించలేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని వేడుకుంటున్నారు....(Bytes). బైట్స్‌:- వినియోగదారులు, శ్రీకాకుళం. VO.3:- ఉల్లిపాయలు శుక్రవారం విక్రయించకపోవడంతో రద్దీ ఎక్కువ అయ్యిందని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులు సహకరించాలని కోరుతున్నారు......(Byte). బైట్‌:- కురిటి రాజశేఖర్‌, ఎస్టేట్‌ అధికారి, శ్రీకాకుళం రైతుబజార్‌. EVO:- అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో దర్జాగా జాతీయ రహదారిపైన లారీలకు లారీలు అక్రమ రవాణాగా వెళ్లిపోతున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉల్లిపాయలు ధరలు బాగా పెరగడంతో.. దక్షిణాది రాష్ట్రాల్లో సాధారణ బజారులో 100 నుంచి 120 ఉండగా.. ఒడిశా, పశ్చిమబంగ రాష్ట్రాల్లో 150 ధరను ఎప్పుడో దాటేసింది. ఈ తేడాలే అక్రమార్కులకు కొత్త ఉపాధి నిచ్చాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి ఉల్లిపాయలను స్థానిక ధరలకు కొనుగోలు చేసి, నకిలీ పత్రాలతో ఒడిశాకు తరలిస్తున్నారు. ఈ వ్యవహారం నిఘా అధికారులకు తెలియడంతో శుక్రవారం ఇచ్ఛాపురం మండలంలోని లొద్దపుట్టి కూడలిలో అన్నీ వాహనాలు తనిఖీలు చేపట్టగా మూడు ఉల్లిపాయల లారీలు పట్టుబడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న అక్ర మార్కులు మరికొన్ని లారీలను గొప్పిలి మీదుగా ఒడిశాకు తరలిం చినట్లు తెలుస్తోంది. మార్కెట్లో అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతలపై దాడులు నిర్వహించి నట్లయితే.. టోకు వర్తకులు వెనక్కి తగ్గి ధరలు తగ్గించి విక్రయాలు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిం చడంలేదు....(Over).

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.