ETV Bharat / state

ఆ కుటుంబాలకు సంక్రాంతి ముందే వచ్చింది...!

author img

By

Published : Jan 8, 2020, 2:44 PM IST

Updated : Jan 8, 2020, 3:15 PM IST

దాయాది దేశం నుంచి విడుదలై వస్తున్నారన్న కబురు ఆ కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. 14 మాసాలు నరకయాతన అనుభవించిన బంధువులు వారి రాకతో ఊపిరి పీల్చుకున్నారు. వారికి నిజమైన సంక్రాంతి ముందే వచ్చిందన్న సంతోషం వ్యక్తమవుతోందా కుటుంబాల్లో.

fishermans family reaction after released from pak
మత్స్యకారుల కుటుంబాల్లో వెల్లువిరిసిన ఆనందం
మత్స్యకారుల కుటుంబాల్లో వెల్లివిరిసిన ఆనందం
ఏడ్చి ఏడ్చి.. నీళ్లింకిపోయిన ఆ కళ్లల్లో ఒక్కసారిగా వెలుగులు నిండాయి. మౌనంగా రోదిస్తూ.. శోకంతో గడిపిన ఆ ముఖాల్లో సంతోషం కనిపించింది. మూగబోయిన ఆ గొంతుల్లో మళ్లీ మాటల గలగలా వినిపించాయి. బెంగతో మంచం పట్టిన పెద్దలు లేచి నడుస్తాం.. అనేంత హుషారొచ్చింది. వీరందరికీ 14 నెలలు చీకట్లో బతికినంత పనైంది. భర్త ఎప్పుడొస్తాడా అని భార్య... తండ్రి తమ వద్దకు ఎప్పుడొస్తాడోనని బిడ్డలు.. తమ కుమారులను మళ్లీ చూడాలని తల్లిదండ్రులు. ఇలా పేగు బంధాలన్నీ కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసేవారు. ఇన్నాళ్లకు వీరి ఆశలు ఫలించాయి.

సిక్కోలుకు జాలర్లు

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని మత్స్యకారుల గ్రామాల్లో ఆనందం వెల్లివిరిసింది. కుటుంబ పోషణ నిమిత్తం గుజరాత్‌లో చేపలవేటకు వెళ్లి పాకిస్థాన్‌ దళాలకు చిక్కిన జాలర్లు వస్తున్నారన్న వార్త ఆ పల్లెలకు పండుగ తెచ్చింది. గతేడాది బందీలైన వారిని తలచుకుంటూ ఆవేదనతో ముగిసిన సంక్రాంతి.. ఈఏడాది మత్స్యకారుల ఆగమనంతో ఆనందమయమైంది.

14 నెలలుగా ఎదురుచూపులు

14 నెలలుగా ఎప్పుడు విడుదలవుతారో.. ఎలా ఉన్నారో.. తెలియక.. దుఖసాగరంలో మునిగాయి ఆ మత్స్యకార కుటుంబాలు. ఆవేదనల మధ్య బతుకీడుస్తున్న బాధితుల్లో ఈ సంవత్సరం కొత్త ఉత్తేజాన్ని నింపింది. వీరు చేసిన విన్నపాలు నెరవేరి.. పాక్ చెరలో చిక్కిన జాలర్లు స్వస్థలానికి చేరుకుంటున్నారు. బందీలైన వారిలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డీ మత్స్యలేశం, కే మత్స్యలేశం, బడివానిపేట, ముద్దాడ గ్రామాలకు చెందిన 15 మందితో పాటు విజయనగరం జిల్లా బోగాపురం మండలం బర్రిపాలెం, పూసపాటిరేగ మండలం తిప్పలవలస చెందిన ఐదుగురు మత్స్యకారులు ఉన్నారు. అప్పటి నుంచి బాధిత కుటుంబాలు ప్రజాప్రతినిధులను కలిసి వీరి విడుదలకు చర్యలు తీసుకోవాలంటూ విన్నవించారు.

ఎంపీల చొరవతో

మత్స్యకారులను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్​నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాలర్ల కుటుంబాలతో కలిసి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి విదేశాంగశాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జై శంకర్‌ను కలిశారు. విదేశాంగశాఖ ప్రయత్నంతో పాకిస్థాన్ ప్రభుత్వం మత్స్యకారులను విడుదల చేసింది. తమ వారి రాక కోసం స్థానికులు, బాధిత కుటుంబసభ్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి:

నేడు భారత్​లో అడుగుపెట్టనున్న మత్స్యకారులు

మత్స్యకారుల కుటుంబాల్లో వెల్లివిరిసిన ఆనందం
ఏడ్చి ఏడ్చి.. నీళ్లింకిపోయిన ఆ కళ్లల్లో ఒక్కసారిగా వెలుగులు నిండాయి. మౌనంగా రోదిస్తూ.. శోకంతో గడిపిన ఆ ముఖాల్లో సంతోషం కనిపించింది. మూగబోయిన ఆ గొంతుల్లో మళ్లీ మాటల గలగలా వినిపించాయి. బెంగతో మంచం పట్టిన పెద్దలు లేచి నడుస్తాం.. అనేంత హుషారొచ్చింది. వీరందరికీ 14 నెలలు చీకట్లో బతికినంత పనైంది. భర్త ఎప్పుడొస్తాడా అని భార్య... తండ్రి తమ వద్దకు ఎప్పుడొస్తాడోనని బిడ్డలు.. తమ కుమారులను మళ్లీ చూడాలని తల్లిదండ్రులు. ఇలా పేగు బంధాలన్నీ కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసేవారు. ఇన్నాళ్లకు వీరి ఆశలు ఫలించాయి.

సిక్కోలుకు జాలర్లు

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని మత్స్యకారుల గ్రామాల్లో ఆనందం వెల్లివిరిసింది. కుటుంబ పోషణ నిమిత్తం గుజరాత్‌లో చేపలవేటకు వెళ్లి పాకిస్థాన్‌ దళాలకు చిక్కిన జాలర్లు వస్తున్నారన్న వార్త ఆ పల్లెలకు పండుగ తెచ్చింది. గతేడాది బందీలైన వారిని తలచుకుంటూ ఆవేదనతో ముగిసిన సంక్రాంతి.. ఈఏడాది మత్స్యకారుల ఆగమనంతో ఆనందమయమైంది.

14 నెలలుగా ఎదురుచూపులు

14 నెలలుగా ఎప్పుడు విడుదలవుతారో.. ఎలా ఉన్నారో.. తెలియక.. దుఖసాగరంలో మునిగాయి ఆ మత్స్యకార కుటుంబాలు. ఆవేదనల మధ్య బతుకీడుస్తున్న బాధితుల్లో ఈ సంవత్సరం కొత్త ఉత్తేజాన్ని నింపింది. వీరు చేసిన విన్నపాలు నెరవేరి.. పాక్ చెరలో చిక్కిన జాలర్లు స్వస్థలానికి చేరుకుంటున్నారు. బందీలైన వారిలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డీ మత్స్యలేశం, కే మత్స్యలేశం, బడివానిపేట, ముద్దాడ గ్రామాలకు చెందిన 15 మందితో పాటు విజయనగరం జిల్లా బోగాపురం మండలం బర్రిపాలెం, పూసపాటిరేగ మండలం తిప్పలవలస చెందిన ఐదుగురు మత్స్యకారులు ఉన్నారు. అప్పటి నుంచి బాధిత కుటుంబాలు ప్రజాప్రతినిధులను కలిసి వీరి విడుదలకు చర్యలు తీసుకోవాలంటూ విన్నవించారు.

ఎంపీల చొరవతో

మత్స్యకారులను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్​నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాలర్ల కుటుంబాలతో కలిసి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి విదేశాంగశాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జై శంకర్‌ను కలిశారు. విదేశాంగశాఖ ప్రయత్నంతో పాకిస్థాన్ ప్రభుత్వం మత్స్యకారులను విడుదల చేసింది. తమ వారి రాక కోసం స్థానికులు, బాధిత కుటుంబసభ్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి:

నేడు భారత్​లో అడుగుపెట్టనున్న మత్స్యకారులు

AP_SKLM_03_07_FISHERMANS_CURTAINRAISER_PKG_AP10172 FROM:- CH.ESWARA RAO, SRIKAKULAM. CAMERA MAN:- CHINNA REDDY, SRIKAKULAM. JAN 07 ------------------------------------------------------------------------------ NOTE:- AP_SKLM_03_07_FISHERMANS_CURTAINRAISER_PKG_FILE_VIS_1_AP10139 AP_SKLM_03_07_FISHERMANS_CURTAINRAISER_PKG_FILE_VIS_2_AP10139 ఈ ఫైల‌్స్‌ మోజో కిట్‌ నుంచి వచ్చాయి. తీసుకోగలరు. --------------------------------------------------------- యాంకర్:- ఏడ్చి ఏడ్చి.. నీళ్లింకిపోయిన ఆ కళ్లల్లో ఒక్కసారిగా వెలుగులు నిండాయి. మౌనంగా రోదిస్తూ.. శోకంతో గడిపిన ఆ మోహాల్లో సంతోషం కనిపించింది. మూగబోయిన ఆగొంతుల్లో మళ్లీ మాటల గలగలలు వినిపించాయి. బెంగతో మంచం పట్టిన పెద్దల్లో లేచి నడుస్తాం.. అనేంత హుషారొచ్చింది. వీరందరికీ 14 నెలలు చీకట్లో బతికినంత పనయింది. భర్త ఎప్పుడొస్తాడా అని భార్య.. తండ్రి తమ వద్దకు ఎప్పుడొస్తాడా అని బిడ్డలు.. తమ కుమారులను మళ్లీ చూడాలని తల్లిదండ్రులు. ఇలా పేగు బంధాలన్నీ కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చేసేవారు. ఇన్నాళ్లకు వీరి ఆశలు ఫలించాయి. వీరు చేసిన విన్నపాలు నెరవేరడంతో.. పాక్ చెరలో చిక్కిన మత్స్యకారులు.. ఈవాళ స్వస్థలానికి రానున్నారు......(Look). VO.1:- శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని మత్స్యకారుల గ్రామాల్లో ఆనందం వెల్లివిరిసింది. కుటుంబ పోషణ నిమిత్తం గుజ రాత్‌ చేపలవేటకు వెళ్లి పాకిస్థాన్‌ భద్రతా దళాలకు చిక్కిన తమ వారు వస్తున్నారన్న వార్తతో ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. గతేడాది బందీలైన వారిని తలచుకుంటూ ఆవేదనతో ముగిసిన సంక్రాంతి.. ఈఏడాది మత్స్యకారుల ఆగమ నంతో ఆనందమయం కానుంది. 14 నెలలుగా ఎప్పుడు విడుదలవుతారో.. ఎలా ఉన్నారో.. తెలియక.. దుఖసాగరంలో మునిగారు. ఆవేదనల మధ్య బతుకీడుస్తున్న బాధిత కుటుంబాల్లో ఈ సంవ త్సరం కొత్త ఉత్తేజాన్ని నింపింది...(Vis+Music). VO.2:- శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్య కారులు 2018 నవంబర్ 27వ తేదీ వేకువజామున గుజరాత్ వద్ద సముద్రవేట చేస్తుండగా పాకిస్థాన్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. బందీలైన వారిలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డీ మత్స్యలేశం, కే మత్స్యలేశం, బడివానిపేట, ముద్దాడ గ్రామాలకు చెందిన 15 మంది తో పాటు విజయనగరం జిల్లా బోగాపురం మండలం బర్రిపాలెం, పూసపాటిరేగ మండలం తిప్పలవలస చెందిన ఐదుగురు మత్స్యకారులు ఉన్నారు. అప్పటి నుంచి బాధిత కుటుంబాలు ప్రజాప్రతినిధులను కలిసి విడుదలకు చర్యలు తీసుకోవాలంటూ విన్నవించడంతో.. ఇటీవల జరిగిన శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడారు. మత్స్యకారుల కుటుంబాలతో కలిసి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి విదేశాంగశాఖ మంత్రి సుబ్ర హ్మమణ్యం జై శంకర్‌ను కలిసి మత్స్యకారుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. విదేశాంగశాఖ ప్రయత్నంతో పాకిస్థాన్ ప్రభుత్వం మత్స్యకారుల విడుదల చేయడంతో.. వీరి ఆనందాలకు ఆవదులులేవు....(Bytes). బైట్‌:- శిరీష, ఎర్రయ్య భార్య, శ్రీకాకుళం జిల్లా. బైట్‌:- ముగతమ్మ, అప్పారావు భార్య, శ్రీకాకుళం జిల్లా. బైట్‌:- నూకమ్మ, రామారావు భార్య, శ్రీకాకుళం జిల్లా. బైట్‌:- తోటమ్మ, రాజు తల్లి, శ్రీకాకుళం జిల్లా. బైట్‌:- నీలవేణి, మణి తల్లి, శ్రీకాకుళం జిల్లా. VO.3:- మత్స్యకారుల కుటుంబాలకు ఇక్కడ ఉపాధి లేకపోవడంతో గుజరాత్‌ వలస వెళ్తున్నారు. వీరంతా వేట కొనసాగి స్తుండగా భారత్ సముద్రజలాల సరిహద్దు దాటి పాకిస్థాన్ జలాల్లోకి పొరపాటున వెళ్లి పోవడం జరుగుతుంది. గతంలో కూడా పాకిస్థాన్ భద్రతా దళాలకు బందీలుగా ఎనిమిది నెలల పాటు అదుపులోకి తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వలసల నివారణకు చర్యలు చేపట్టాలని మత్స్యకారుల కుటుంబాలు కోరుతున్నాయి.......(Bytes). బైట్‌:- ‌లక్ష్మీ, సుమంత్‌ భార్య, శ్రీకాకుళం జిల్లా. బైట్‌:- ముగతమ్మ, అప్పారావు భార్య, శ్రీకాకుళం జిల్లా. బైట్‌:- శిరీష, ఎర్రయ్య భార్య, శ్రీకాకుళం జిల్లా. EVO:- వాఘా సరిహద్దులో సోమవారం రాత్రి 20 మంది మత్స్యకారులను మంత్రి మోపిదేవి వెంకటరమణ నేతృత్వంలోని బృందానికి అప్పగించారు. నేడు స్వస్థలానికి రానున్న నేపథ్యంలో మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి.....(Over).
Last Updated : Jan 8, 2020, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.