ETV Bharat / state

దక్షిణాది రాష్ట్రాల బ్యాండ్ పోటీల్లో విజేతగా ఆంధ్రా జట్టు

ఒంగోలులో జరిగిన దక్షిణాది రాష్ట్రాల బ్యాండ్ పోటీల్లో బాలుర విభాగంలో ఆంధ్రా జట్టు, బాలికల విభాగంలో కేరళ జట్టు విజయం సాధించాయి.

author img

By

Published : Dec 24, 2019, 8:58 AM IST

South_Zone_Banding competion
బ్యాండ్ పోటీల్లో విజేతగా ఆంధ్రా జట్టు
బ్యాండ్ పోటీల్లో విజేతగా ఆంధ్రా జట్టు

ప్రకాశం జిల్లా ఒంగోలులో దక్షిణాది రాష్ట్రాల బ్యాండ్ పోటీలు జరిగాయి. తాడేపల్లిగూడెం బాలయోగి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలకు చెందిన బాలుర జట్టు బాలుర విభాగంలో కప్ దక్కించుకుంది. బాలికల విభాగంలో కేరళ జట్టు గెలిచింది. ఏడు రాష్ట్రాల నుంచి వచ్చిన 13 బృందాల్లో విజేతలుగా నిలిచిన ఈ జట్లు.. జనవరి 26న జరగనున్న స్వాతంత్ర దినోత్సవ పరేడ్​లో కవాతు నిర్వహించనున్నాయి. వీరికి మానవ వనరుల శాఖ బ్యాండ్ కో ఆర్డినేటర్ గిరిజాశంకర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జాతీయ స్థాయిలో ప్రదర్శన ఇవ్వాలనేదే లక్ష్యంగా ఉంటుందని... అది తాము సాధించినందుకు గర్వంగా ఉందని విజేతలు చెప్పారు.

బ్యాండ్ పోటీల్లో విజేతగా ఆంధ్రా జట్టు

ప్రకాశం జిల్లా ఒంగోలులో దక్షిణాది రాష్ట్రాల బ్యాండ్ పోటీలు జరిగాయి. తాడేపల్లిగూడెం బాలయోగి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలకు చెందిన బాలుర జట్టు బాలుర విభాగంలో కప్ దక్కించుకుంది. బాలికల విభాగంలో కేరళ జట్టు గెలిచింది. ఏడు రాష్ట్రాల నుంచి వచ్చిన 13 బృందాల్లో విజేతలుగా నిలిచిన ఈ జట్లు.. జనవరి 26న జరగనున్న స్వాతంత్ర దినోత్సవ పరేడ్​లో కవాతు నిర్వహించనున్నాయి. వీరికి మానవ వనరుల శాఖ బ్యాండ్ కో ఆర్డినేటర్ గిరిజాశంకర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జాతీయ స్థాయిలో ప్రదర్శన ఇవ్వాలనేదే లక్ష్యంగా ఉంటుందని... అది తాము సాధించినందుకు గర్వంగా ఉందని విజేతలు చెప్పారు.

ఇవీ చదవండి:

'కోహ్లీ, రోహిత్‌ కంటే.. సచిన్‌, సౌరభ్‌ అత్యుత్తమం'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.