ETV Bharat / state

చోరీ కేసులో యజమాని కూతురే నిందితురాలు..!

author img

By

Published : Nov 6, 2019, 7:10 PM IST

Updated : Nov 6, 2019, 11:46 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పేరం బజార్లో గత నెల 25 న ఓ ఇంట్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కాల్​ డేటా ఆధారంగా విచారించిన పోలీసులు ఇంటి యజమాని కూతురే నిందితురాలని నిర్ధరించారు.

గోల్డ్ చోరీ
చోరీ కేసులో యజమాని కూతురే నిందితురాలు..!

ప్రకాశం జిల్లా మార్కాపురం పేరం బజార్లో గత నెల 25న ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటి యజమాని కుమార్తె... దొంగతనం చేయించినట్లుగా పోలీసులు నిర్ధరించారు. తెల్లవారు జామున 4 గంటల సమయంలో బంగారం అపహరణకు గురైనట్లు ఇంటి యజమానిరాలితో పాటు కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించారు. ఇంటి యజమాని కుమార్తె విజయవాడకు చెందిన సమీప బంధువైన సాయి రాజేష్​ను పిలిపించి... బంగారం అప్పజెప్పినట్లు డీఎస్పీ నాగేశ్వర రెడ్డి తెలిపారు. అతని​తో పాటు దీనికి సహకరించిన మరో యువకుడు శశాంక్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.7.50 లక్షలు విలువ చేసే 21 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

మార్కాపురంలో రూ.11 లక్షల బంగారు ఆభరణాలు చోరీ

చోరీ కేసులో యజమాని కూతురే నిందితురాలు..!

ప్రకాశం జిల్లా మార్కాపురం పేరం బజార్లో గత నెల 25న ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటి యజమాని కుమార్తె... దొంగతనం చేయించినట్లుగా పోలీసులు నిర్ధరించారు. తెల్లవారు జామున 4 గంటల సమయంలో బంగారం అపహరణకు గురైనట్లు ఇంటి యజమానిరాలితో పాటు కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించారు. ఇంటి యజమాని కుమార్తె విజయవాడకు చెందిన సమీప బంధువైన సాయి రాజేష్​ను పిలిపించి... బంగారం అప్పజెప్పినట్లు డీఎస్పీ నాగేశ్వర రెడ్డి తెలిపారు. అతని​తో పాటు దీనికి సహకరించిన మరో యువకుడు శశాంక్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.7.50 లక్షలు విలువ చేసే 21 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

మార్కాపురంలో రూ.11 లక్షల బంగారు ఆభరణాలు చోరీ

Intro:AP_ONG_81_06_GOLD_RECOVERY_AVB_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం పేరం బజార్ లో గత నెల 25 న ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటి యజమాని కుమార్తె... చోరీ చేయించినట్లు గా పోలీసులు నిర్థారించారు. తెల్లవారు జామున 4 గంటల సమయం లో బంగారం అపహరణ కు గురైనట్లు ఇంటి యజమానిరాలి తో పాటు కుమార్తె.... ఇద్దరు కలసి బంగారం మాయమైనట్లు గా పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించారు. విజయవాడ కు చెందిన సమీప బంధువైన సాయి రాజేష్ ను పిలిపించి ఇంటి యజమాని కుమార్తె నే... బంగారం అప్పజెప్పినట్లు డీఎస్పీ నాగేశ్వర రెడ్డి తెలిపారు. సాయి రాజేష్ తో పాటు మరో యువకుడు శశాంక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 7.50 లక్ష విలువ చేసే 21 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ విజయవాడ లోని ఓ ప్రేవేట్ కళాశాలలో బిటెక్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.

బైట్: నాగేశ్వరరెడ్డి డీఎస్పీ మార్కాపురం.


Body:చోరీ రికవరీ.


Conclusion:8008019243.
Last Updated : Nov 6, 2019, 11:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.