ETV Bharat / state

చిన్నారి విన్నపాన్ని సీరియస్​గా తీసుకోవాలి: చంద్రబాబు - జగన్

ముఖ్యమంత్రి జగన్​కు ఓ చిన్నారి లేఖ రాయడంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. కల్లాకపటం తెలియని పసి వయసులో చిన్నారిని వెలి వేయడం సభ్య సమాజానికి సిగ్గు చేటని ఆవేదన వ్యక్తం చేశారు.

cbn-respon-on-girl-letter
author img

By

Published : Sep 14, 2019, 5:48 PM IST

తమను గ్రామం నుంచి వెలివేశారంటూ ఓ చిన్నారి ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాయడం తెలిసిందే. ఆ విషయంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం చిన్నారి కోడేరు పుష్ప విన్నపాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్​గా తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తమ ఊళ్లో దుర్భర పరిస్థితులను లేఖ ద్వారా వెల్లడించి, న్యాయం కోరిన చిన్నారి ధైర్యాన్ని చంద్రబాబు అభినందించారు. తన తండ్రి, తాతలకు ప్రాణాపాయం ఉందనే భయాన్ని ఆ చిన్నారిలో తొలగించాలని కోరారు. చిన్నారి పుష్ప నిర్భీతిగా, స్వేచ్ఛగా చదువుకోవాలని, రేపటి పౌరురాలిగా ఎదగాలని ఆకాంక్షించారు.

తమను గ్రామం నుంచి వెలివేశారంటూ ఓ చిన్నారి ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాయడం తెలిసిందే. ఆ విషయంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం చిన్నారి కోడేరు పుష్ప విన్నపాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్​గా తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తమ ఊళ్లో దుర్భర పరిస్థితులను లేఖ ద్వారా వెల్లడించి, న్యాయం కోరిన చిన్నారి ధైర్యాన్ని చంద్రబాబు అభినందించారు. తన తండ్రి, తాతలకు ప్రాణాపాయం ఉందనే భయాన్ని ఆ చిన్నారిలో తొలగించాలని కోరారు. చిన్నారి పుష్ప నిర్భీతిగా, స్వేచ్ఛగా చదువుకోవాలని, రేపటి పౌరురాలిగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: చిన్నారి లేఖపై స్పందించిన జగన్​..విచారణకు ఆదేశం

Intro:FILE NAME : AP_ONG_41_14_CM_JAGAN_KU_LETTER_ADHIKARULA_VICHARANA_AVB_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA ( PRAKASAM )

యాంకర్ వాయస్ : తన కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేశారని, బడిలోనూ తమపట్ల వివక్షత చూపుతున్నారని ప్రకాశం జిల్లా కు చెందిన 9 ఏళ్ల బాలిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి లేఖరాసింది... దీంతో అధికారులు స్పందించి వేటపాలెం మండలం రామచంద్రపురం లో సాంఘిక బహిష్కరణ వ్యవహారం కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.... ఈ సంఘటనలో బాధితుడి పిల్లలు బడికి వెళ్తే ఆ బడిలో మొత్తం పిల్లలందర్నీగ్రామస్తులు బడి మాన్పించిన ఉదంతం కలకలం రేపింది.. ఈ క్రమంలో బాధితుడు కోడూరి వెంకటేశ్వర్లు మనవరాలు 4వ తరగతి చదువుతున్న చిన్నారి పుష్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తమ కుటుంబంలోని పరిస్థితులను వివరిస్తూ ఉత్తరం రాసింది. ఈ నేపథ్యంలో రామచంద్రపురం గ్రామానికి ఇన్చార్జి కలెక్టర్ షన్మోహన్, చీరాల డిఎస్పీ జయరామసుబ్బారెడ్డి, పోలీసులు, మాజీ ఎమ్మెల్యే, వైకాపా నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ లు చేరుకొని గ్రామస్థులతో మాట్లాడారు... బాధితుడు కోడూరు వెంకటేశ్వర్లు మనవరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఉత్తరం రాయడం పై ప్రసారమాధ్యమాల్లో ప్రసారం కావడం సీఎం కార్యాలయం నుండి సంఘటనపై జిల్లా అధికారులను వాకబు చేయడంతో ఇన్చార్జి కలెక్టర్ మోహన్ వేటపాలెం మండలం రామచంద్రపురం గ్రామాన్ని సందర్శించారు. జరిగిన సంఘటనపై గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.. మాజీ ఎంపిటిసి సభ్యుడు కోడూరు వెంకటేశ్వర్లు గ్రామానికి చేసిన అన్యాయం పై మత్స్యకారులు ఇంఛార్జి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.. మత్స్యకార సొసైటీ నుండి గ్రామానికి వచ్చిన వాళ్ళను సొంతానికి వాడుకున్నారని గ్రామస్తులకు డబ్బులు కూడా ఇవ్వాలని గ్రామ పెద్దలు చెప్పారు ముఖ్యమంత్రికి అతను మనవరాలు ఉత్తరం రాయడం అబద్ధమని దీనికి ప్రధాన కారణం నాగార్జున్ రెడ్డి అనే వ్యక్తి అని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు... అన్ని విధాల గ్రామస్తులను వెంకటేశ్వర్లు మోసం చేశాడని గడిచిన మూడు నెలల నుండి పెద్దల సమావేశానికి రావాలని సమాచారం పంపిన రాకుండా తిరుగుతూ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని గ్రామ పెద్దలు ఇన్చార్జి కలెక్టర్, జే సి షన్మోహన్ కు తెలిపారు. ఇక గ్రామాల్లో ఉన్న కట్టుబాట్లు దాని విషయమై త్వరలో మాట్లాడతానని అప్పటివరకు వివాదాలకు చోటు లేకుండా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ షన్మోహన్ గ్రామస్తులకు చేప్పారు..


Body:బైట్ : షన్మోహన్ - ఇంచార్జి కలెక్టర్, ప్రకాశం జిల్లా.


Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.