నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై చుక్కల భూముల రైతులు ఆందోళన చేపట్టారు. చుక్కల భూముల రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి... పట్టాలు ఇవ్వాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నెల్లూరు జిల్లా చుక్కల భూముల రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారి కావడంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు సర్దిచెప్పేందుకు యత్నించినా...వారు వినకపోవడంతో తహసీల్దారు సంఘటనా స్థలానికి చేరుకుని వారంలోగా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: ఆ తల్లి కష్టం చూస్తే.. కళ్లు చెమర్చాల్సిందే!