ETV Bharat / state

బరితెగించిన అక్రమార్కులు... శ్మశాన భూములపై బ్యాంకు రుణాలు..! - యూ.కొత్తపల్లి వార్తలు

మనిషి గిట్టాక ఉపయోగపడే శ్మశానాన్నీ అక్రమార్కులు వదల్లేదు. ఇప్పటికే వాగులు, వంకల్లోని భూములను కబ్జా చేశారు. ఇప్పుడు మరింత ముందుకెళ్లి... శ్మశాన స్థలాలు, పొలాలకి వెళ్లే దారులనూ ఆక్రమిస్తున్నారు. ఈ వ్యవహారం 'ఈనాడు- ఈటీవీ' కథనాలతో వెలుగులోకి వచ్చింది. అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

The crematorium in u.kottapalli was occupied
శ్మశానం కబ్జా
author img

By

Published : Nov 29, 2019, 11:10 PM IST

శ్మశాన భూములపై బ్యాంకు రుణాలు

కర్నూలు జిల్లా డోన్‌ మండలం యూ.కొత్తపల్లి జాతీయ రహదారికి ఆనుకుని ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన నబి సాహెబ్‌ అనే వ్యక్తి... సర్వే నంబర్‌ 331/1లో ముస్లింల శ్మశానం కోసం నాలుగున్నర ఎకరాల స్థలాన్ని ఇచ్చారు. కొన్నేళ్లుగా అక్కడ చనిపోయిన వారికి అంత్యక్రియలు జరుగుతున్నాయి. అయితే మూడేళ్ల క్రితం ఈ భూమిని అక్రమార్కులు కబ్జా చేశారు. బ్యాంకులో క్రాపులోనూ తెచ్చుకున్నారు.

ఈ విషయం బ్యాంకు అధికారుల ద్వారా తెలుసుకున్న గ్రామస్థులు... శ్మశాన స్థలాన్ని వేరే వ్యక్తుల పేర్లమీదకి ఎలా మారుస్తారంటూ... మండిపడ్డారు. ఇదే కాదు శ్మశానానికి చుట్టుపక్కల కనిపించిన పొలాల రికార్డులను సైతం కబ్జారాయుళ్లు రెవెన్యూ అధికారుల అండతో... తమ కుటుంబసభ్యుల పేర్లమీదకి బదలాయించుకున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌తో సహా కలెక్టర్‌కు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేనది గ్రామస్థులు చెప్పారు.

'ఈనాడు- ఈటీవీ' కథనాలకు స్పందన...
శ్మశానం కబ్జా వ్యవహారంపై శుక్రవారం 'ఈనాడు- ఈటీవీ​'లో... ''శ్మశానాల్లో చెట్టాపట్టాల్'', "శ్మశానాన్నీ వదల్లేదు" శీర్షికన కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన డోన్ తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి గ్రామానికి వెళ్లి శ్మశాన స్థలాన్ని పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. శ్మశాన స్థలానికి పాస్​ బుక్కులు చేసుకోవడం వాస్తవమేనని తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. తక్షణమే ఈ సర్వే నంబర్​తో ఉన్న వివరాలన్నింటినీ ఆన్​లైన్, రెవెన్యూ రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు. 2 రోజుల్లో శ్మశాన స్థలానికి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. అవినీతికి పాల్పడిన అధికారిని గుర్తించి... చర్యలు తీసుకునేలా కలెక్టర్​కు నివేదిక పంపుతామని వెల్లడించారు.

శ్మశాన భూములపై బ్యాంకు రుణాలు

కర్నూలు జిల్లా డోన్‌ మండలం యూ.కొత్తపల్లి జాతీయ రహదారికి ఆనుకుని ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన నబి సాహెబ్‌ అనే వ్యక్తి... సర్వే నంబర్‌ 331/1లో ముస్లింల శ్మశానం కోసం నాలుగున్నర ఎకరాల స్థలాన్ని ఇచ్చారు. కొన్నేళ్లుగా అక్కడ చనిపోయిన వారికి అంత్యక్రియలు జరుగుతున్నాయి. అయితే మూడేళ్ల క్రితం ఈ భూమిని అక్రమార్కులు కబ్జా చేశారు. బ్యాంకులో క్రాపులోనూ తెచ్చుకున్నారు.

ఈ విషయం బ్యాంకు అధికారుల ద్వారా తెలుసుకున్న గ్రామస్థులు... శ్మశాన స్థలాన్ని వేరే వ్యక్తుల పేర్లమీదకి ఎలా మారుస్తారంటూ... మండిపడ్డారు. ఇదే కాదు శ్మశానానికి చుట్టుపక్కల కనిపించిన పొలాల రికార్డులను సైతం కబ్జారాయుళ్లు రెవెన్యూ అధికారుల అండతో... తమ కుటుంబసభ్యుల పేర్లమీదకి బదలాయించుకున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌తో సహా కలెక్టర్‌కు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేనది గ్రామస్థులు చెప్పారు.

'ఈనాడు- ఈటీవీ' కథనాలకు స్పందన...
శ్మశానం కబ్జా వ్యవహారంపై శుక్రవారం 'ఈనాడు- ఈటీవీ​'లో... ''శ్మశానాల్లో చెట్టాపట్టాల్'', "శ్మశానాన్నీ వదల్లేదు" శీర్షికన కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన డోన్ తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి గ్రామానికి వెళ్లి శ్మశాన స్థలాన్ని పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. శ్మశాన స్థలానికి పాస్​ బుక్కులు చేసుకోవడం వాస్తవమేనని తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. తక్షణమే ఈ సర్వే నంబర్​తో ఉన్న వివరాలన్నింటినీ ఆన్​లైన్, రెవెన్యూ రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు. 2 రోజుల్లో శ్మశాన స్థలానికి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. అవినీతికి పాల్పడిన అధికారిని గుర్తించి... చర్యలు తీసుకునేలా కలెక్టర్​కు నివేదిక పంపుతామని వెల్లడించారు.

Intro:p_knl_52_29_eenadu_etv_story_spandhana_ab_pkgAP10055

s.sudhakar, dhone


ఈరోజు ఈనాడు ఈటీవీ లో స్మశానంను వదల్లేదు అనే కథనానికి అధికారులు స్పందించారు.

కర్నూలు జిల్లా డోన్ మండలం యు కొత్తపల్లి గ్రామంలో 333/1 సర్వేనెంబర్ లో స్మశానo ఉంది. ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి స్మశాన స్థలాన్ని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆన్ లైన్, అడంగల్, పాస్ బుక్కులు చేసుకున్నాడు. ఈరోజు ఈటీవీలో స్మశానాన్ని వదల్లేదు అనే కథనానికి డోన్ తహాసిల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి స్పందించి గ్రామానికి వెళ్లి స్మశాన స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో సమస్యలపై తాసిల్దార్ అడిగి తెలుసుకొని, రికార్డులను పరిశీలించారు. స్మశాన స్థలాన్ని రెవెన్యూ రికార్డులో ఆన్లైన్ పాస్బుక్కులు చేసుకోవడం వాస్తవమేనని తహసిల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. తక్షణమే ఈ సర్వే నంబర్ లో ఉన్న వ్యక్తి యొక్క ఆన్లైన్,రెవిన్యూ రికార్డ్ లలో తొలగిస్తామన్నారు. రెండు రోజుల్లో స్మశాన స్థలాన్ని క్లీన్ చేసి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. స్మశాన స్థలాన్ని రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించిన అధికారిని గుర్తించి అతనిపై చర్యలు తీసుకునేలా కలెక్టర్ కు నివేదిక పంపుతామని తహాసిల్దార్ అన్నారు.

బైట్.

నరేందర్ రెడ్డి,
తహాసిల్దార్,డోన్.


Body:ఈనాడు ఈ టీవీ కథనానికి స్పందించిన అధికారులు


Conclusion:kit no.692, cell no.9394440169
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.