ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ చెప్పారు. జిల్లాలోని పత్తికొండలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ తో కలిసి హాజరయ్యారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మండల స్థాయిలో పరిష్కారాల కోసం సంబంధిత అధికారులను ఆదేశించామని చెప్పారు.
ఇవీ చదవండి