కర్నూలు జిల్లా ఆలూరు మండలం మెులగవల్లి కొట్టాల గ్రామానికి చెందిన 15 మంది మహిళలు, పది మంది పురుషులు జట్టుగా ఏర్పడి రేడియోలో జానపద గేయాలు పాడుతూ శ్రోతలను అలరిస్తున్నారు. స్థానిక పెద్దమనిషి సంగప్ప ఈరన్న సహకారంతో రేడియోలో పాటలు పాడే అవకాశం వాళ్లకు వచ్చింది. మొదట గ్రామానికి వచ్చి ...వారు పాడే పాటలు రికార్డు చేసి రేడియోలో శ్రోతల కోసం వినిపించేవారు. తరువాత గ్రూపు సభ్యులను రేడియో స్టేషన్లకే పిలిపించి పాటలు పాడిస్తున్నారు.
కళాకారుల ఫించన్ ఇప్పించాలి
గ్రూపు సభ్యులు కర్నూలు, అనంతపురం, కడప రేడియో స్టేషన్లలో పాటలు పాడి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. పాటలు పాడేందుకు వెళ్లిన సమయంలో వారు ఇచ్చే నగదును సమానంగా పంచుకుంటారు. అరకొరగా వచ్చే ఆదాయంతో కుటుంబాలను నెట్టుకురావడం ఇబ్బందిగా ఉందని... తమలాంటి వారికి ప్రభుత్వం కళాకారుల పింఛన్ ఇప్పించాలని వారు కోరుతున్నారు.
ఇవీ చదవండి: