ETV Bharat / state

టిక్ టాక్ స్నేహం... వివాహిత, ఇద్దరు పిల్లలు అదృశ్యం..! - women missing by tick talk friend at kurnool today news in telugu

టిక్ టాక్​..ఇది ఇప్పుడున్న ట్రెండ్..ఫేస్​బుక్, వాట్సాప్ లాంటి దిగ్గజ యాప్​లను పక్కకు నెట్టి యువతను తనవైపునకు లాగేసుకుంటున్న ఓ మాయా ప్రపంచం. ముందు టిక్ టాక్​తో స్నేహం.. ఆపై వారితో పరిచయాలు సహజంగా ఇలా జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ స్నేహం ఇంటివరకూ రావడం.. స్నేహం కోసం మహిళ ఇద్దరు పిల్లలతో సహా వెళ్లిపోయిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.. అసలేం జరిగింది..!

kurnool married women missing because of her tick talk friend
టిక్ టాక్ ముసుగులో..వివాహిత, ఇద్దరు పిల్లలు అపహరణ..!
author img

By

Published : Dec 13, 2019, 6:59 PM IST

Updated : Dec 13, 2019, 7:18 PM IST

టిక్ టాక్ ముసుగులో..వివాహిత, ఇద్దరు పిల్లలు అపహరణ..!

టిక్ టాక్ ముసుగులో వివాహిత అర్చన అదృశ్యమైన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఆదోని పట్టణం కిలిచినపేటకు చెందిన అర్చనకు అంజలి అనే మహిళ టిక్ టాక్ ద్వారా పరిచయమైంది. వీరి స్నేహం ఒకరి ఇంటికి మరొకరు వెళ్లే వరకూ వచ్చింది. అర్చనకు కర్ణాటక ప్రాంతానికి చెందిన రవితో 13 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు సంతానం. భర్త డ్రైవర్ కావడంతో వారానికి రెండు, మూడు రోజుల మాత్రమే ఇంటి దగ్గర ఉండేవారు. కొన్ని నెలల క్రితం అర్చన తన పుట్టినిల్లు ఆదోనికి వచ్చినప్పుడు తనతోపాటే అంజలి కూడా వచ్చింది. భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి ఉండేదని కుటుంబ సభ్యులంటున్నారు. ఆ మహిళ వేషధారణ కూడా తేడాగా ఉందని... ఎప్పుడూ చొక్కా, ప్యాంట్ ధరిస్తుందని బంధువులు తెలిపారు. అంజలి ఆడపిల్ల కావడంతో ఇంట్లో ఉంచుకున్నామని కుటుంబ సభ్యులంటున్నారు. నాలుగు రోజుల క్రితం అర్చనతో పాటు ఇద్దరు పిల్లలు అదృశ్యం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అర్చన, పిల్లలను అంజలి అపహరించి ఉంటుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అదృశ్యమైన తమ కుమార్తె, పిల్లల ఆచూకీ తెలుసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

టిక్ టాక్ ముసుగులో..వివాహిత, ఇద్దరు పిల్లలు అపహరణ..!

టిక్ టాక్ ముసుగులో వివాహిత అర్చన అదృశ్యమైన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఆదోని పట్టణం కిలిచినపేటకు చెందిన అర్చనకు అంజలి అనే మహిళ టిక్ టాక్ ద్వారా పరిచయమైంది. వీరి స్నేహం ఒకరి ఇంటికి మరొకరు వెళ్లే వరకూ వచ్చింది. అర్చనకు కర్ణాటక ప్రాంతానికి చెందిన రవితో 13 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు సంతానం. భర్త డ్రైవర్ కావడంతో వారానికి రెండు, మూడు రోజుల మాత్రమే ఇంటి దగ్గర ఉండేవారు. కొన్ని నెలల క్రితం అర్చన తన పుట్టినిల్లు ఆదోనికి వచ్చినప్పుడు తనతోపాటే అంజలి కూడా వచ్చింది. భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి ఉండేదని కుటుంబ సభ్యులంటున్నారు. ఆ మహిళ వేషధారణ కూడా తేడాగా ఉందని... ఎప్పుడూ చొక్కా, ప్యాంట్ ధరిస్తుందని బంధువులు తెలిపారు. అంజలి ఆడపిల్ల కావడంతో ఇంట్లో ఉంచుకున్నామని కుటుంబ సభ్యులంటున్నారు. నాలుగు రోజుల క్రితం అర్చనతో పాటు ఇద్దరు పిల్లలు అదృశ్యం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అర్చన, పిల్లలను అంజలి అపహరించి ఉంటుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అదృశ్యమైన తమ కుమార్తె, పిల్లల ఆచూకీ తెలుసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

ఇదీ చదవండీ:

కానిస్టేబుల్​ను అరెస్టు చేసిన పోలీసులు... ఎందుకంటే!

sample description
Last Updated : Dec 13, 2019, 7:18 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.