కుందనం రాళ్లతో అమ్మవారి రూపం...ఆకర్షణీయం దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కర్నూలు నంద్యాలకు చెందిన వైదేహీ అనే బీటెక్ విద్యార్థిని అమ్మవారి చిత్రాన్ని వేసింది. 16 వందల 50 కుందనాలతో నాలుగు గంటల సమయంలో అమ్మవారి చిత్రాన్ని గీసింది. కుందనం రంగురాళ్లతో వేసిన చిత్రం ఆకట్టుకుంటోంది. స్థానిక కోటేష్ ఆర్ట్స్ అకాడమీలో చిత్రకారిణి శిక్షణ తీసుకుంటోంది. చిత్రాన్ని గీసిన ఆ విద్యార్దినిని అకాడమి డైరెక్టర్ కోటేష్ అభినందించారు. గాంధీ 150 వ జయంతి సందర్భంగా విద్యార్థిని గీసిన బాపు చిత్రానికి హైదరాబాద్లో గోల్డ్ మెడల్ అందుకుంది. ఇవీ చూడండి-తన చిట్టితల్లి కోసం... ఓ అమ్మ పడే ఆరాటం!