ETV Bharat / state

అనుకున్నది సాధించాడు.... కటకటాలపాలయ్యాడు

author img

By

Published : Apr 17, 2019, 10:14 AM IST

అక్రమసంబంధం కారణంగా మూడేళ్ల కిందట ప్రసాద్ అనే వ్యక్తిని ప్రభాకర్ చంపి రైల్వే పట్టాలపై పడేశారు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న బాధితుడి కుమారుడు హత్య చేసిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకున్నాడు.

తండ్రిని చంపిన వ్యక్తిపై ప్రతికారం తీర్చుకున్న కుమారుడు

కృష్ణాజిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లిలో మూడేళ్ల క్రితం ఓ హత్య జరిగింది. అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్న కోపంతో ప్రసాద్‌ అనే వ్యక్తిని 2016 డిసెంబర్‌లో ప్రభాకర్‌ చంపి రైల్వేపట్టాలపై పడేశాడు. అప్పట్లో సంచలనమైన ఈ కేసును పోలీసులు ఛేదించి... ప్రభాకర్‌ను జైలుకు పంపించారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన ఆయన... వేరే గ్రామంలో ప్రశాంతంగా జీవిస్తున్నాడు.
తండ్రి హత్యకు కారణమైన ప్రభాకర్‌పై పగ పెంచుకున్నాడు ప్రసాద్‌ కుమారుడు. సమయం కోసం ఎదురు చూస్తున్న అతను... ఓ పని మీద తన గ్రామానికి వచ్చిన ప్రభాకర్‌పై దాడి చేశాడు. 13 మందితో కలిసి దారుణంగా కొట్టి బండరాయితో మోది హత్య చేశాడు.
జిల్లా వ్యాప్తంగా సంచలనమైన ఈ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. హత్య కేసులో నిందితులందర్నీ అరెస్టు చేశారు. విచారణలో వారు చెప్పే నిజాలు విని ఆశ్చర్యపోయారు. వారిని రిమాండ్‌కు తరలించారు.

తండ్రిని చంపిన వ్యక్తిపై ప్రతికారం తీర్చుకున్న కుమారుడు

కృష్ణాజిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లిలో మూడేళ్ల క్రితం ఓ హత్య జరిగింది. అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్న కోపంతో ప్రసాద్‌ అనే వ్యక్తిని 2016 డిసెంబర్‌లో ప్రభాకర్‌ చంపి రైల్వేపట్టాలపై పడేశాడు. అప్పట్లో సంచలనమైన ఈ కేసును పోలీసులు ఛేదించి... ప్రభాకర్‌ను జైలుకు పంపించారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన ఆయన... వేరే గ్రామంలో ప్రశాంతంగా జీవిస్తున్నాడు.
తండ్రి హత్యకు కారణమైన ప్రభాకర్‌పై పగ పెంచుకున్నాడు ప్రసాద్‌ కుమారుడు. సమయం కోసం ఎదురు చూస్తున్న అతను... ఓ పని మీద తన గ్రామానికి వచ్చిన ప్రభాకర్‌పై దాడి చేశాడు. 13 మందితో కలిసి దారుణంగా కొట్టి బండరాయితో మోది హత్య చేశాడు.
జిల్లా వ్యాప్తంగా సంచలనమైన ఈ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. హత్య కేసులో నిందితులందర్నీ అరెస్టు చేశారు. విచారణలో వారు చెప్పే నిజాలు విని ఆశ్చర్యపోయారు. వారిని రిమాండ్‌కు తరలించారు.

తండ్రిని చంపిన వ్యక్తిపై ప్రతికారం తీర్చుకున్న కుమారుడు

ఇవీ చదవండి

అనుమానంతో భార్యను అంతం చేసిన భర్త

Thiruvarur (TN), Apr 16 (ANI): Dravida Munnetra Kazhagam (DMK) chief MK Stalin held a roadshow in Thiruvarur, Tamil Nadu. A huge crowd gathered to show support. Tamil Nadu will vote in the second phase of Lok Sabha elections.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.