ETV Bharat / state

తమ్మిలేరుకు మరమ్మత్తులెప్పుడో...? - తమ్మిలేరుకు మరమ్మత్తులెప్పుడో...?

కృష్ణా జిల్లా మెట్టప్రాంత వర ప్రదాయని తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టుకు కష్టాలు ఇప్పట్లో గట్టెక్కేలా లేవు. నాలుగు దశాబ్దాలుగా మెట్ట రైతుల పాలిట కల్పతరువుగా ఉన్న తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి... అవసరం మేరకు మరమ్మతులు నిర్వహించాలని రైతాంగం కోరుతోంది.

Tammilure Reservoir Project
తమ్మిలేరుకు మరమ్మత్తులెప్పుడో...?
author img

By

Published : Dec 13, 2019, 9:06 PM IST

తమ్మిలేరుకు మరమ్మత్తులెప్పుడో

కృష్ణా జిల్లా చాట్రాయి మండలం మంకొల్లు ప్రాంతంలోని తమ్మిలేరు ప్రాజెక్టు గత 15 సంవత్సరాలుగా వివిధ దశల్లో మరమ్మతులకు నోచుకోక అంతంతమాత్రంగానే ఉపయోగంలో ఉందని అక్కడి రైతాంగం ఆందోళన చెందుతున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలకు వరదలతో వచ్చే నీటిని సద్వినియోగం చేసుకునే పరిస్థితిలో ప్రాజెక్టు లేకపోవడం విచారకరమని వాపోయారు. త్వరలో పూర్తి కానున్న చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించేందుకు ఇప్పటికే ప్రణాళికలు పూర్తయ్యీయి. అయితే ఆ మేరకు నిల్వ చేసేందుకు ప్రాజెక్టు సామర్థ్యం పెంచకపోవడం వల్ల నీళ్లు వృథా అవుతాయేమోనని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

40 ఏళ్లైనా మరమ్మతులు లేవు

పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో సుమారు 30 వేల ఎకరాలకుపైగా సాగునీరు అందిస్తున్న తమ్మిలేరు ప్రాజెక్టు ప్రస్తుతం మెరక తేలి ఉంది. దీని వల్ల 3 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్న ఈ జలాశయంలో ఇప్పుడు రెండు టీఎంసీల నీరు సైతం నిల్వ ఉంచలేని దుస్థితి నెలకొంది. చింతలపూడి ఎత్తిపోతల పథకం నీరు.. ప్రాజెక్టులోకి మళ్లించే నాటికి జలాశయంలో ఆక్రమణలు తొలగించి, పూడిక తీసి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మించి 40 ఏళ్ళు దాటిపోయినా ఇంత వరకూ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

త్వరితగతిన పూర్తి చేయాలి

గడిచిన 30 ఏళ్లుగా తమ్మిలేరు ప్రాజెక్ట్​తో ఎన్నో ప్రయోజనాలు పొందగలిగామనీ... చింతలపూడి ఎత్తిపోతల పథకం అందుబాటులోకి వస్తే మరిన్ని పంటలు పండించగలమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ్మిలేరు ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి అవసరం మేరకు మరమ్మతులు నిర్వహించాలని రైతాంగం కోరుతోంది. వానలు వస్తే గొడుగులు వెతుక్కునే చందంగా కాకుండా ముందు జాగ్రత్త చర్యగా చేపడితే.. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి సాగు వైపు మళ్లించడం సులభమవుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను త్వరగా పూర్తి చేసి తమ్మిలేరుకు సాగు నీరు అందించాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ప్రకృతి సేద్యం... ప్రజలకు అమృతం..!

తమ్మిలేరుకు మరమ్మత్తులెప్పుడో

కృష్ణా జిల్లా చాట్రాయి మండలం మంకొల్లు ప్రాంతంలోని తమ్మిలేరు ప్రాజెక్టు గత 15 సంవత్సరాలుగా వివిధ దశల్లో మరమ్మతులకు నోచుకోక అంతంతమాత్రంగానే ఉపయోగంలో ఉందని అక్కడి రైతాంగం ఆందోళన చెందుతున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలకు వరదలతో వచ్చే నీటిని సద్వినియోగం చేసుకునే పరిస్థితిలో ప్రాజెక్టు లేకపోవడం విచారకరమని వాపోయారు. త్వరలో పూర్తి కానున్న చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించేందుకు ఇప్పటికే ప్రణాళికలు పూర్తయ్యీయి. అయితే ఆ మేరకు నిల్వ చేసేందుకు ప్రాజెక్టు సామర్థ్యం పెంచకపోవడం వల్ల నీళ్లు వృథా అవుతాయేమోనని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

40 ఏళ్లైనా మరమ్మతులు లేవు

పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో సుమారు 30 వేల ఎకరాలకుపైగా సాగునీరు అందిస్తున్న తమ్మిలేరు ప్రాజెక్టు ప్రస్తుతం మెరక తేలి ఉంది. దీని వల్ల 3 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్న ఈ జలాశయంలో ఇప్పుడు రెండు టీఎంసీల నీరు సైతం నిల్వ ఉంచలేని దుస్థితి నెలకొంది. చింతలపూడి ఎత్తిపోతల పథకం నీరు.. ప్రాజెక్టులోకి మళ్లించే నాటికి జలాశయంలో ఆక్రమణలు తొలగించి, పూడిక తీసి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మించి 40 ఏళ్ళు దాటిపోయినా ఇంత వరకూ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

త్వరితగతిన పూర్తి చేయాలి

గడిచిన 30 ఏళ్లుగా తమ్మిలేరు ప్రాజెక్ట్​తో ఎన్నో ప్రయోజనాలు పొందగలిగామనీ... చింతలపూడి ఎత్తిపోతల పథకం అందుబాటులోకి వస్తే మరిన్ని పంటలు పండించగలమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ్మిలేరు ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి అవసరం మేరకు మరమ్మతులు నిర్వహించాలని రైతాంగం కోరుతోంది. వానలు వస్తే గొడుగులు వెతుక్కునే చందంగా కాకుండా ముందు జాగ్రత్త చర్యగా చేపడితే.. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి సాగు వైపు మళ్లించడం సులభమవుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను త్వరగా పూర్తి చేసి తమ్మిలేరుకు సాగు నీరు అందించాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ప్రకృతి సేద్యం... ప్రజలకు అమృతం..!

Intro:ap_vja_09_11_thamileru_jalasayam_pkg_ap10122
కృష్ణాజిల్లా చాట్రాయి
కృష్ణాజిల్లా చాట్రాయి మండలం మంకొల్లు ప్రాంతంలోని తమ్మిలేరు ప్రాజెక్టు గత 15 సంవత్సరాలుగా వివిధ దశల్లో మరమ్మతులకు నోచుకోక అంతంతమాత్రంగానే ఉపయోగంలో ఉందని రైతాంగం పేర్కొంటున్నారు అడపాదడపా కురిసిన వర్షాలకు అకాల వరదలతో తరలి వచ్చే నీటిని సద్వినియోగం చేసుకునే పరిస్థితిలో ప్రాజెక్టు లేకపోవడం విచారకరమని అని అన్నారు త్వరలో పూర్తి కానున్న చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా తరలించే సాగునీటి ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు తరలింపు ప్రక్రియ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు అయితే ఆ మేరకు నిల్వచేసేందుకు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడం నిర్వహించకపోవడంతో వృధా అవుతాయి ఏమోనని అనుమానాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు ప్రాజెక్టు పరిధిలోని రాంబాబు అనే రైతు మాట్లాడుతూ రెండు పంటలు పండిస్తూ ఆనందంగా ఉంటుందని తెలియజేశాడు రామారావు అనే రైతు మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా వస్తే రైతు వ్యవసాయ పనులు కొనసాగిస్తుంది అన్నారు రమణ అనే రైతు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాజెక్టు పది అడుగుల మేరకు నీటిని అందించి జరుగుతుందని తద్వారా అన్ని పంటలు పండించే అవకాశం ఉందని తెలిపారు గోపాల్ అనే రైతు మాట్లాడుతూ గడిచిన 30 సంవత్సరాలుగా తమ్మిలేరు ప్రాజెక్ట్ తో ఎన్నో ప్రయోజనాలు పొందగలిగే మనీ వరి మొక్కజొన్న మిరప వంటి పంటలు పండించే వాని చింతలపూడి ఎత్తిపోతల పథకం అందుబాటులోకి రాగలిగితే రెండు పంటలు పండించి మరిన్ని లాభాలు పొందగలము వివరిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ్మిలేరు ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి అవసరం మేరకు మరమ్మతులు నిర్వహించాలని రైతాంగం కోరుతోంది వానలు వస్తే గొడుగులు వెతుక్కునే చందంగా కాకుండా ముందు జాగ్రత్త చర్యగా చేపడితే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి సాగు వైపు మళ్లించడం సులభం అని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు
బైట్స్ 1)2)3)4) తమ్మిలేరు ఆనకట్ట రైతులు
( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)


Body:తమ్మిలేరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం పెంచాలి


Conclusion:తమ్మిలేరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం పెంచాలి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.