కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు..20 గేట్లు ఎత్తివేత - మళ్లీ పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ
ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వరద వస్తుండటంతో..మరోసారి బ్యారేజీ గేట్లను ఎత్తేశారు. బ్యారేజీలోకి 53 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా..20గేట్లుఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
prakasam barrage
By
Published : Sep 3, 2019, 1:27 PM IST
మళ్లీ పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ
.
మళ్లీ పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ
.
Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు సెంటర్ : కదిరి జిల్లా :అనంతపురం మొబైల్ నం 7032975449 Ap_Atp_46_03_MP_AT_Market_Hotels_AVB_AP10004 Ap_Atp_46a_03_MP_AT_Market_Hotels_AVB_AP10004
Body:పేదల వాడలలో సమస్యలు తెలుసుకునేందుకు పార్లమెంట్ సభ్యుడు వేకువజామునే పర్యటించి స్థానికులతో అక్కడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లా కదిరి మునిసిపాలిటీ పరిధిలోని పేదల వాడలో హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ పర్యటించారు. కదిరి పట్టణంలో ఎక్కువ భాగం పేదల వాడలు (స్లమ్ ఏరియాలు) ఉన్నాయి. వేకువజామునే పట్టణంలోని వలీసాబ్ రోడ్, పాత కుమ్మర వీధి, కూరగాయల మార్కెట్ ప్రాంతంలో పర్యటించారు. ఉదయపు నడకకు వెళ్ళిన వారితో కలిసి టీ కొట్టు వద్ద చాయ్ తాగారు. అక్కడే హోటల్ లో టిఫిన్ చేశారు. ఎక్కడికక్కడ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూరగాయల మార్కెట్ కు వెళ్లి రైతులు, వినియోగదారులు, వ్యాపారులతో వారి సమస్యలను తెలుసుకున్నారు. మురికివాడలలో అభివృద్ధికి చేపట్టాల్సిన పనులను గుర్తించారు. ఆ తర్వాత సమీపంలోని మదరసాలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలపై నిర్వాహకులతో చర్చించారు. మదరసా లో మౌళిక వసతుల కల్పనకు చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలోని పేదల వాడలో అధికారులతో కలిసి పర్యటించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ గోరంట్ల మాధవ్ హామీ ఇచ్చారు.
Conclusion:బైట్ గోరంట్ల మాధవ్, పార్లమెంటు సభ్యుడు, హిందూపురం