కృష్ణాజిల్లా బంటుమిల్లిలో తెదేపా-వైకాపా వర్గీయులు పరస్పర దాడులు చేసుకున్నారు. చీపుర్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో తెదేపాకు చెందిన ముగ్గురికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. వైకాపాకు చెందిన చినబాబు దాడి చేశారంటూ పోలీస్స్టేషన్ను ముట్టడించారు. తెదేపాకు చెందిన కాగిత వెంకట్రావు తమపైనే ముందుగా దాడి చేశారంటూ వైకాపా నేతలు ఆరోపించారు. స్టేషన్ ఎదుట ఇరువర్గాలు నిరసన చేపట్టారు. రెండు పార్టీల దగ్గర నుంచి కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి