ETV Bharat / state

'శాంతియుతంగా అమరావతి పరిరక్షణ ఆందోళన' - అమరావతి పరిరక్షణ సమితి ముగ్గుల పోటీల న్యూస్

రాజధాని అమరావతి పరిరక్షణ ఆందోళన కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేసేందుకు 'అమరావతి పరిరక్షణ సమితి' కొన్ని నిర్ణయాలు తీసుకుంది. శాంతి యుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించింది.

jac pressmeet
అమరావతి పరిరక్షణ సమితి సమావేశం
author img

By

Published : Jan 14, 2020, 11:12 PM IST

అమరావతి పరిరక్షణ సమితి సమావేశం

రాజధాని అమరావతి పరిరక్షణ ఆందోళన కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేసేందుకు 'అమరావతి పరిరక్షణ సమితి' కీలక నిర్ణయాలు తీసుకుంది. సంక్రాంతి సందర్భంగా ఈనెల 15న ముగ్గుల పోటీల్లో అమరావతి పరిరక్షణ నినాదాన్ని మార్మోగించబోతోంది. 3 రాజధానుల ప్రతిపాదన తెరమీదకు వచ్చిన తర్వాత చనిపోయిన రైతుల ఫొటోలతో 16న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 17న ఐకాస యువజన విభాగం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తారు. రాజధాని అమరావతి కోసం ఇప్పటివరకు రూ.62.72 లక్షల నగదు విరాళంగా వివిధ వర్గాల నుంచి సమకూరిందని పరిరక్షణ సమితి పేర్కొంది. విరాళాల కోసం ప్రత్యేకంగా ఓ బ్యాంకు ఖాతాను ప్రారంభించింది. అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ తమ నిరసన గళాన్ని తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించింది.

అమరావతి పరిరక్షణ సమితి సమావేశం

రాజధాని అమరావతి పరిరక్షణ ఆందోళన కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేసేందుకు 'అమరావతి పరిరక్షణ సమితి' కీలక నిర్ణయాలు తీసుకుంది. సంక్రాంతి సందర్భంగా ఈనెల 15న ముగ్గుల పోటీల్లో అమరావతి పరిరక్షణ నినాదాన్ని మార్మోగించబోతోంది. 3 రాజధానుల ప్రతిపాదన తెరమీదకు వచ్చిన తర్వాత చనిపోయిన రైతుల ఫొటోలతో 16న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 17న ఐకాస యువజన విభాగం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తారు. రాజధాని అమరావతి కోసం ఇప్పటివరకు రూ.62.72 లక్షల నగదు విరాళంగా వివిధ వర్గాల నుంచి సమకూరిందని పరిరక్షణ సమితి పేర్కొంది. విరాళాల కోసం ప్రత్యేకంగా ఓ బ్యాంకు ఖాతాను ప్రారంభించింది. అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ తమ నిరసన గళాన్ని తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించింది.

ఇదీ చూడండి:

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ధర్నాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.