అమరావతి కోసం పటమట వాసులు ఏం చేశారో తెలుసా? - patamata different support for amaravathi news
రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రైతుల ఉద్యమానికి సంఘీభావంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో.. పోలీసులు అరెస్టు చేస్తుండడంపై వినూత్నంగా తమ నిరసన తెలుపుతున్నారు. విజయవాడ పటమట ఫన్ టైమ్స్ ప్రాంత ప్రజలు.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ప్రతి ఇంటి గేటుకు బోర్డులు పెట్టి తమ మద్దతు తెలుపుతున్నారు.
రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రాజధాని పరిరక్షణ కోసం అమరావతి జేఏసీ తరఫున నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు ప్రజలు పాల్గొంటున్నా అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకుంటున్నారు. రైతుల ఉద్యమానికి సంఘీభావంగా ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శన, నిరసన కార్యక్రమాలు చేసినా పోలీసులు అరెస్టు చేస్తుండడంతో వినూత్నంగా తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు విజయవాడ పటమట ఫన్ టైమ్స్ ప్రాంతవాసులు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలంటూ ప్రతి ఇంటి గేటుకు బోర్డులు పెట్టి తమ మద్దతు తెలుపుతున్నారు.