ETV Bharat / state

ఒకేచోట 110 దేశాల అరుదైన కరెన్సీ

author img

By

Published : Dec 16, 2019, 2:50 PM IST

చరిత్రకు అవి సజీవ సాక్ష్యాలు.. కాలానుగుణంగా చోటు చేసుకున్న మార్పులకు ప్రత్యక్ష నిదర్శనాలు. వినోదంతో పాటు విజ్ఞానం పంచుతూ అందరినీ అలరిస్తున్నాయి. గత కాలపు ప్రపంచాన్ని, గతించిన వైభవాన్ని కళ్లముందే ఆవిష్కరిస్తున్నాయి.

rare-currency
rare-currency
ఒకే చోట 110 దేశాల అరుదైన కరెన్సీ నోట్లు

అరుదైన నాణాలు, స్టాంపులు ప్రదర్శిస్తూ గుంటూరు బృందావన్ గార్డెన్స్​లో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్టాంప్స్, కాయిన్స్ ఫెస్టివల్ స్థానికులకు ఎనలేని వినోదం, విజ్ఞానం పంచింది. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు, న్యూమిస్మాటిక్, ఫిలాటెలిక్ సొసైటీ రజతోత్సవాలు పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులు, చరిత్ర, సంస్కృతికి ఈ ప్రదర్శన అద్దం పట్టింది.

అలనాటి అర్ధణా, బేడ, పావలా నాణేలు సహా స్వాతంత్రోద్యమ కాలం నాటి కరెన్సీ నోట్లు ప్రదర్శించారు. మొత్తం మీద 110 దేశాల అరుదైన కరెన్సీ అందరినీ అబ్బురపరిచాయి. గాంధీ, మదర్ థెరిస్సా, రామ్ మనోహర్ లోహియా, ఇందిరాగాంధీ వంటి ప్రముఖుల సంతకాలు, వారి ఫోటోతో వచ్చిన స్టాంపులు ఆకట్టుకున్నాయి. అరుదైన ఫ్యాన్సీ నంబర్లు కలిగిన కరెన్సీ నోట్లను పలువురు విక్రయానికి ఉంచారు. తయారీలో లోపాలతో సహా వచ్చిన నోట్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యులు, విద్యావేత్త కాసరనేని సదాశివరావు పేరిట 2 ప్రత్యేక తపాలా బిళ్లలు విడుదల చేశారు.

విజ్ఞానం, వినోదం పంచుతూనే స్టాంపులు, నాణేల సేకరణ ప్రవృత్తిని నేటి తరానికి పరిచయం చేయాలన్నదే తమ ఉద్దేశమని నిర్వహకులు తెలిపారు. తల్లిదండ్రులతో సహా వచ్చిన విద్యార్థులు స్టాంపులు, నాణేల ప్రదర్శనను ఆస్వాదించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేశారు.

ఇవి కూడా చదవండి:

'ప్లాస్టిక్'​ వ్యర్థాలతో సుందర గృహాలంకరణలు

ఒకే చోట 110 దేశాల అరుదైన కరెన్సీ నోట్లు

అరుదైన నాణాలు, స్టాంపులు ప్రదర్శిస్తూ గుంటూరు బృందావన్ గార్డెన్స్​లో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్టాంప్స్, కాయిన్స్ ఫెస్టివల్ స్థానికులకు ఎనలేని వినోదం, విజ్ఞానం పంచింది. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు, న్యూమిస్మాటిక్, ఫిలాటెలిక్ సొసైటీ రజతోత్సవాలు పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులు, చరిత్ర, సంస్కృతికి ఈ ప్రదర్శన అద్దం పట్టింది.

అలనాటి అర్ధణా, బేడ, పావలా నాణేలు సహా స్వాతంత్రోద్యమ కాలం నాటి కరెన్సీ నోట్లు ప్రదర్శించారు. మొత్తం మీద 110 దేశాల అరుదైన కరెన్సీ అందరినీ అబ్బురపరిచాయి. గాంధీ, మదర్ థెరిస్సా, రామ్ మనోహర్ లోహియా, ఇందిరాగాంధీ వంటి ప్రముఖుల సంతకాలు, వారి ఫోటోతో వచ్చిన స్టాంపులు ఆకట్టుకున్నాయి. అరుదైన ఫ్యాన్సీ నంబర్లు కలిగిన కరెన్సీ నోట్లను పలువురు విక్రయానికి ఉంచారు. తయారీలో లోపాలతో సహా వచ్చిన నోట్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యులు, విద్యావేత్త కాసరనేని సదాశివరావు పేరిట 2 ప్రత్యేక తపాలా బిళ్లలు విడుదల చేశారు.

విజ్ఞానం, వినోదం పంచుతూనే స్టాంపులు, నాణేల సేకరణ ప్రవృత్తిని నేటి తరానికి పరిచయం చేయాలన్నదే తమ ఉద్దేశమని నిర్వహకులు తెలిపారు. తల్లిదండ్రులతో సహా వచ్చిన విద్యార్థులు స్టాంపులు, నాణేల ప్రదర్శనను ఆస్వాదించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేశారు.

ఇవి కూడా చదవండి:

'ప్లాస్టిక్'​ వ్యర్థాలతో సుందర గృహాలంకరణలు

AP_GNT_03_15_RARE_CURRENCY_COINS_STAMPS_PKG_3067949 REPORTER: P.SURYA RAO CAMERA: ALI Anchor: కాలంతోపాటే కరెన్సీ కొత్తరూపు సంతరించుకుంటోంది. కొత్త కొత్త నాణేలు ముద్రితమవుతున్నాయి. ఉత్తరాలకు ఆదరణ కు తగ్గినా విభిన్నరకాల స్టాంపుల సేకరణకు ఆదరణ తగ్గలేదు. పాత, కొత్త మేలు కలయిగా విభిన్న కలెక్షన్లతో గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి ప్రదర్శన ఆబాలగోపాలాన్ని ఎంతగానో ఆకట్టుకుంది....LOOK.... V.O.1: జాతిపిత మహాత్మా గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు, న్యూమిస్మటిక్ ఫిలాటెలిక్ సొసైటీ రజతోత్సవాల సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్సు బాలాజీ మండపంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్టాంప్స్, కాయిన్స్ ఫెస్టివల్ ప్రదర్శన...అందరికీ వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచిపెట్టింది. కాలానుగుణ మార్పులు, మన చరిత్ర, సంస్కృతికి ఈ ప్రదర్శన అద్దం పట్టింది. ఏకంగా 110 దేశాలకు చెందిన అరుదైన కరెన్సీ నోట్లను ప్రదర్శనలో ఉంచారు. వివిధ కరెన్సీ నోట్లపై ఆయా దేశాలు ప్రచురించిన డిజైన్లు, చారిత్రక ఘట్టాలు, ప్రముఖుల ఫోటోలు నోట్లపై దర్శనమిచ్చాయి. స్వాతంత్రోద్యమ కాలంనాటి నోట్లు, కాయిన్లతోపాటు కొత్తగా వచ్చిన వాటిని ప్రదర్శనలో ఉంచారు. ఒకనాటి అర్ధణా, బేడ, పావలా వంటి కాయిన్లు దర్శనమిచ్చాయి. గాంధీజీ, మదర్ థెరిస్సా, రామ్ మనోహర్ లోహియా, ఇందిరాగాంధీ వంటి ప్రముఖుల సంతకాలు, వారి ఫోటోతో వచ్చిన స్టాంపులు ఆకట్టుకున్నాయి. గాంధీజీ పేరున దేశంలో వెలసిన పోస్టాపీసుల పేర్లతో తయారుచేసిన పోస్టల్ కవర్లు, స్టాంపులు దర్శనమిచ్చాయి. మరికొందరు అరుదైన ఫ్యాన్సీ నంబర్లు కలిగిన వివిధ రకాల కరెన్సీ నోట్లను విక్రయానికి ఉంచారు. దేవుడి బొమ్మలు, పురాతన పాత్రలు, పనిముట్లు కొలువు దీరాయి. తయారీలో లోపాలున్న నోట్లన సైతం ప్రదర్శించారు. ప్రదర్శనలో భాగంగా గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యులు, విద్యావేత్త కాసరనేని సదాశివరావు పేరిట రెండు ప్రత్యేక తపాలా బిళ్లలను విడుదల చేశారు. భవిష్యత్తు తరాలకు మన చరిత్రను చేరవేయడం, కరెన్సీ, స్టాంపులపై అందరిలో ఆసక్తిని రేకెత్తించడం ప్రదర్శన లక్ష్యమని నిర్వాహకులు చెప్పారు.....SPOT+BYTE.... BYTE: ఎంవీఎస్ ప్రసాద్, నిర్వాహకుడు BYTE: సుబ్రమణ్యం, అరుదైన కరెన్సీనోట్ల విక్రేత V.O.2: ఎన్నడూ చూడని అరుదైన కలెక్షన్లతో వినియోగదారులు సంబరపడ్డారు. విజ్ఞానం, మనోవికాసం కల్గించేలా ఏర్పాటు చేసిన ప్రదర్శన చూసి విద్యార్థులు సైతం తల్లిదండ్రులతో కలసి తరలివచ్చారు. తమకు నచ్చిన వాటిని కొనుక్కొన్నారు..SPOT+BYTES... BYTE: రవికిశోర్, గుంటూరు BYTE: ఎస్.శివాని, విద్యార్థిని BYTE: శివ కోటేశ్వరరావు, గుంటూరు E.V.O.: వివిధ రకాల పనుల ఒత్తిడితో బిజీబిజీగా ఉండే నగరవాసులకు రెండ్రోజుల స్టాంపులు, కరెన్సీనోట్లు, కాయిన్ల ప్రదర్శన వినోదాన్ని పంచింది. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని జరిగాలని అభిమానులు కోరుతున్నారు....END.....

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.