రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు సోమవారం నుంచి తాము విధులకు హాజరవుతామని... కానీ హైకోర్టును తరలిస్తే ఊరుకోమని కోస్తాంధ్ర జిల్లాల న్యాయవాదులు స్పష్టం చేశారు. ఉన్నత న్యాయస్థానం తరలింపు ప్రయత్నాలకు వ్యతిరేకంగా గుంటూరులో న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలిస్తున్నారని వస్తున్న ప్రకటనల నేపథ్యంలో గత 50 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర బాబు తెలిపారు. హైకోర్టు తరలింపునకు తాము పూర్తిగా వ్యతిరేకమన్న ఆయన... అమరావతి నుంచి హైకోర్టు తరలిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: