ETV Bharat / state

'రాజధాని ఉండాల్సింది... విశాఖలో కాదు..!' - amaravathi agitation in ponnuru news

మూడు రాజధానుల ప్రతిపాదనకు నిరసనగా గుంటూరు జిల్లా పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర నిరసన దీక్ష నిర్వహించారు. దీక్షలో వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు.

ex mla dhulipalla narendra agitation at ponnuru
ధూళిపాళ్ల నిరసన దీక్ష
author img

By

Published : Jan 1, 2020, 6:01 PM IST

ధూళిపాళ్ల నిరసన దీక్ష

రాజధానిని అమరావతి నుంచి తరలించే ప్రతిపాదనను నిరసిస్తూ గుంటూరు జిల్లా పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్​ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్లే ముఖ్యమంత్రిని సామాన్యులు కలిసే అవకాశం లేకుండా పోయిందన్నారు. స్పీకర్​ తమ్మినేని సీతారాం, ధర్మాన, బొత్స ఉత్తరాంధ్రను వెనకబడిన ప్రాంతం అని అంటున్నారన్నారు. గతంలో సుధీర్ఘంగా మంత్రి పదవుల్లో ఉన్నప్పడు ఆ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. వెనకబాటుతనం ప్రాతిపదికన రాజధానిని విశాఖలో ఏర్పాటు చేయకూడదనీ, శ్రీకాకుళంలో కానీ విజయనగరం జిల్లాలో కానీ ఏర్పాటు చేయాలన్నారు. తాము చేస్తున్న దీక్షకు ఏ పార్టీతో సంబంధం లేదనీ, ఎవరైనా పాల్గొనవచ్చునని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: అమరావతి కోసం.. భువనేశ్వరి గాజులు విరాళం

ధూళిపాళ్ల నిరసన దీక్ష

రాజధానిని అమరావతి నుంచి తరలించే ప్రతిపాదనను నిరసిస్తూ గుంటూరు జిల్లా పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్​ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్లే ముఖ్యమంత్రిని సామాన్యులు కలిసే అవకాశం లేకుండా పోయిందన్నారు. స్పీకర్​ తమ్మినేని సీతారాం, ధర్మాన, బొత్స ఉత్తరాంధ్రను వెనకబడిన ప్రాంతం అని అంటున్నారన్నారు. గతంలో సుధీర్ఘంగా మంత్రి పదవుల్లో ఉన్నప్పడు ఆ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. వెనకబాటుతనం ప్రాతిపదికన రాజధానిని విశాఖలో ఏర్పాటు చేయకూడదనీ, శ్రీకాకుళంలో కానీ విజయనగరం జిల్లాలో కానీ ఏర్పాటు చేయాలన్నారు. తాము చేస్తున్న దీక్షకు ఏ పార్టీతో సంబంధం లేదనీ, ఎవరైనా పాల్గొనవచ్చునని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: అమరావతి కోసం.. భువనేశ్వరి గాజులు విరాళం

Intro:Ap_gnt_01_51_rajadhani_taralimpu_narisanadeekasha_by_ex_mla_narendra_AP10117
రాజధానిని అమరావతి నుంచి తరలింపుకు నిరసనగా గుంటూరు జిల్లా పొన్నూరు ఎన్ జి రంగా విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ నిరసన దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజలు ముఖ్యమంత్రిని కలిసేందుకు ఏర్పాటుచేసిన ప్రజా వేదిక ను కూలగొట్టారు అన్నారు ప్రస్తుతం మంత్రులు ధర్మాన బొత్స స్పీకర్ తమ్మినేని సీతారాం లు ఉత్తరాంధ్ర వెనుకబడిన కాబట్టి అక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలని అంటున్నారని వారంతా గతంలో లో సుదీర్ఘకాలంగా మంత్రి పదవులు అలంకరించాలని అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు వెనుకబాటుతనం ప్రాతిపదికన తీసుకుంటే రాజధాని అనంతపురం లేదా శ్రీకాకుళంలో ఏర్పాటు చేయాలన్నారు


Body:రాజధాని ద్రోహులు ఎవరంటే స్థానికంగా ఉన్న అధికార పార్టీ శాసనసభ్యులు లేనని ఊరూరు తిరిగి ప్రచారం చేస్తామన్నారు రాజధాని తరలిపోతే ఈ ప్రాంత రైతులు అధికంగా నష్టపోతారని తాము చేస్తున్న ఈ నిరసన దీక్షకు ఏ పార్టీతో సంబంధం లేదని ఎవరైనా రావచ్చు అన్నారు


Conclusion:ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు సంఘీభావం తెలిపారు
రిపోర్టర్ నాగరాజు పొన్నూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.