తెదేపా నేత యరపతినేనిపై దాఖలైన మైనింగ్ కేసును.. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని కోణంకి, దాచేపల్లి మండలంలోని కేసనపల్లి, నడికుడి గ్రామాల్లోని సున్నపురాతి గనుల తవ్వకాలు, రవాణాపై విచారణ చేయాలని చెప్పింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ చేసిన సీఐడీ విభాగం... దర్యాప్తునకు సంబంధించిన వివరాలను సీబీఐకి పంపింది. ఈ కేసు సీబీఐ విచారణకు సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేస్తున్నట్టు రాష్ట్ర హోంశాఖ పేర్కోంది. రాష్ట్రంలో సీబీఐకి సాధారణ సమ్మతి పునరుద్ధరణ అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థకు తొలికేసు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టైంది.
ఇదీ చదవండి:
సున్నపురాయి అక్రమ తవ్వకాలపై ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛనిస్తాం...హైకోర్టు