ETV Bharat / state

నీటి గంటకు కలుషిత నీరు... తాగితే జబ్బులు..! - తూర్పుగోదావరి ప్రభుత్వ పాఠశాలలో నీటి గంట కష్టాలు

ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవలే నీటిగంట కార్యక్రమాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తగిన మోతాదులో చిన్నారులు నీటిని తీసుకోవడంలేదని గ్రహించి.. ప్రత్యేక దృష్టితో నీటిగంటను అమలు చేస్తోంది. నిర్ణయం వరకూ బానే ఉన్నా.. అమలులో ఎదురవుతున్న లోపాలు.. విద్యార్థుల ప్రాణం మీదకి తెచ్చేలా కనిపిస్తున్నాయి.

water problems at government schools at east godavari district
తూర్పుగోదావరి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నీటి గంట కష్టాలు
author img

By

Published : Dec 4, 2019, 8:59 PM IST

నీటి గంటకు కలుషిత నీరు... తాగితే జబ్బులు..!

ప్రభుత్వ పాఠశాలల్లో నీటిగంట అమలు తీరుపై 'ఈనాడు- ఈటీవీ భారత్' బృందం చేసిన అధ్యయనంలో ఆందోనళనకర విషయాలు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా తుని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో 1100 మంది విద్యార్థినులకు కోరికోరి రోగాలు అంటించిట్టుగా పరిస్థితులు తయారవుతున్నాయి. ఈ బడిలో ఉన్న నీటి ట్యాంకు లోపల తుప్పు పట్టింది. అందులో నీరు కలుషితమైంది. మరో ట్యాంకులోని నీటిలో వ్యర్థాలు, చిన్నచిన్న పురుగులు ఉన్నాయి. బడిలోని ఆర్వో ప్లాంటు పాడైపోయింది. నీటి డబ్బాలు ఉన్నా ఖాళీగానే కనిపిస్తున్నాయి.

బడిగంట కార్యక్రమం బాగానే ఉన్నా... ఇలా కలుషితమైన నీటిని మాత్రం తాగలేకపోతున్నామని చిన్నారులు ఆవేదన చెందుతున్నారు. బయట కొనుక్కోవాల్సి వస్తోందని చెప్పారు. ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. తునిలోనే కాదు... మరికొన్ని పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. లక్ష్యం మంచిదైనా... ఆచరణ లోపమే అసలు సమస్యగా మారింది.

ఇదీ చదవండి: ఈనాడు కథనానికి సీఎం స్పందన.. చిన్నారి కళ్లకు భరోసా

నీటి గంటకు కలుషిత నీరు... తాగితే జబ్బులు..!

ప్రభుత్వ పాఠశాలల్లో నీటిగంట అమలు తీరుపై 'ఈనాడు- ఈటీవీ భారత్' బృందం చేసిన అధ్యయనంలో ఆందోనళనకర విషయాలు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా తుని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో 1100 మంది విద్యార్థినులకు కోరికోరి రోగాలు అంటించిట్టుగా పరిస్థితులు తయారవుతున్నాయి. ఈ బడిలో ఉన్న నీటి ట్యాంకు లోపల తుప్పు పట్టింది. అందులో నీరు కలుషితమైంది. మరో ట్యాంకులోని నీటిలో వ్యర్థాలు, చిన్నచిన్న పురుగులు ఉన్నాయి. బడిలోని ఆర్వో ప్లాంటు పాడైపోయింది. నీటి డబ్బాలు ఉన్నా ఖాళీగానే కనిపిస్తున్నాయి.

బడిగంట కార్యక్రమం బాగానే ఉన్నా... ఇలా కలుషితమైన నీటిని మాత్రం తాగలేకపోతున్నామని చిన్నారులు ఆవేదన చెందుతున్నారు. బయట కొనుక్కోవాల్సి వస్తోందని చెప్పారు. ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. తునిలోనే కాదు... మరికొన్ని పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. లక్ష్యం మంచిదైనా... ఆచరణ లోపమే అసలు సమస్యగా మారింది.

ఇదీ చదవండి: ఈనాడు కథనానికి సీఎం స్పందన.. చిన్నారి కళ్లకు భరోసా

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231


Body:ap_rjy_31_03_water_problem_school_etv_oberve_p_v_raju_pkg_AP10025_HD. యాంకర్: పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థుల్లో అధిక శాతం మంది తగిన మోతాదులో నీరు తాగడం లేదు. దీంతో విద్యార్థులు పలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు తూర్పుగోదావరి జిల్లా విద్యా శాఖ అధికారులు కేరళ రాష్ర్టం పాఠశాలల్లో నీటి బెల్లు కార్యక్రమాన్ని ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించారు. పాఠశాలలో రోజుకు నాలుగు సార్లు నీరు తాగేలా నీటి గంట మోగిస్తారు. విద్యార్థులు వారు తెచ్చుకున్న నీటి సీసాలో పాఠశాలలో నీటి పట్టుకుని తాగాలి. అసలు ఈ కార్యక్రమం ఎలా అమలు అవుతోందో ఈటీవీ, ఈనాడు బృందం పలు పాఠశాలల్లో పరిశీలిస్తే ఆందోళనకర విషయాలు బయటపడ్డాయి. ఆ నీరు తాగితే విద్యార్థులకు రోగాలు ఖాయం అన్నట్లు ఉంది పరిస్థితి. వాయిస్ ఓవర్: తుని జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో 1100 మంది విద్యార్థినిలు చదువుతున్నారు. వీరు తాగే నీటి ట్యాంక్ లోపల చేస్తే భయమేస్తోంది. కుళాయి ఇప్పి చూస్తే రంగు మరి వస్తుంది. చిన్న నీటి ట్యాంక్ లోపల తుప్పు పట్టి, నీరు కలుషితమైంది. మరో ట్యాంకులో లోపల వ్యర్ధాలు, సూక్ష్మ పురుగులు ఉన్నాయి. లోపల ఎలా ఉందో తెలియక ఈ నీటినే తాగుతున్నారు. బైట్ లు: విద్యార్థులు. బైట్: నూకరత్నం, ప్రధానోపాధ్యాయురాలు. వాయిస్ ఓవర్ 2: రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇదే పరిస్థితి. రక్షిత నీరు లేదు. ఆర్వో ప్లాంట్ పని చేయడం లేదు. కనీసం నీటి డబ్బాలు ఉన్న అవన్నీ ఖాళీగా ఉన్నాయి. నీటి కి బయటకు వెళ్లి దుకాణాల వద్ద, బయట ఉన్న పురపాలక భవనం వద్ద తాగాల్సి వస్తున్నదని విద్యార్థులు వాపోతున్నారు. బైట్లు: విద్యార్థులు. బైట్: ప్రభాకర శర్మ, ప్రధానోపాధ్యాయుడు. ఫైనల్ వాయిస్ ఓవర్: ఇక్కడే కాదు జిల్లాలో ఇతర పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉంది. పాఠశాలల్లో తీవ్రంగా ఉన్న తాగు నీటి సమస్య పై అధికారులు దృష్టి సారించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.


Conclusion:ఓవర్...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.