తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం వలసపాకలలో దారుణం జరిగింది. 2రూపాయల కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ వివాదం చివరకు ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. సువర్ణరాజు అనే వ్యక్తి సైకిల్లో గాలి నింపించుకునేందుకు సాంబ షాపుకు వచ్చాడు. గాలి నింపిన తర్వాత సువర్ణ రాజును.. సాంబ 2రూపాయలు అడిగాడు. ఆగ్రహించిన సువర్ణరాజు సైకిల్ షాపు యజమాని సాంబను కొట్టాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సాంబ స్నేహితుడు అప్పారావు... సువర్ణరాజుపై రాడ్డుతో దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. బాధితుడిని వెంటనే కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సువర్ణరాజు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ఇవీ చూడండి-అన్నదాతల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్కు నాలుగో స్థానం