గణతంత్ర దినోత్సవం వస్తున్న సందర్భంగా తిరుపతికి చెందిన మౌలేశ్... సూక్ష్మ కళాకృతులతో తన దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. జాతీయగీతం జనగణమన, త్రివర్ణ పతాకాన్ని పెన్సిల్ కొనపై రూపొందించి ఔరా అనిపించాడు. వారంరోజుల పాటు శ్రమించి పెన్సిల్ విరగకుండా ఒకే ప్రయత్నంలో... 13 లైన్ల జాతీయగీతాన్ని, 13 పెన్సిళ్ల కొనలపై చెక్కాడు మౌలేశ్. సూక్ష్మకళలో నైపుణ్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నానని చెబుతున్నాడు ఈ కళాకారుడు.
ఇదీ చదవండి : పెన్సిల్ కొనపై కళాకృతులు... యువకుడిపై ప్రశంసలు