ETV Bharat / state

చెగువేరాలోని తెగువ... ఐన్​స్టీన్​లోని తెలివి.. కలిపితే జార్జ్..!

1972 ఏప్రిల్ 14... ఇంజినీరింగ్ కాలేజీ ఎన్నికలకు ఒక రోజు ముందు... ఉస్మానియా విశ్వవిద్యాలయం... హైదరాబాద్. సమయం రాత్రి 10 గంటలకు అటు ఇటూ. కటిక చీకటి... తెలుగు సమాజానికి ఏదో చెడు వార్త చెప్పడానికి... సిద్ధమైంది. నమ్మకద్రోహమో ఏమో... పడగ విప్పి కాటు వేయడానికి పన్నాగం పన్నింది. అంతే... కొన్ని క్షణాల్లో విద్యార్థి విప్లవ తార... జార్జ్​రెడ్డి హత్యకు గురయ్యారు అనే వార్త వినిపించింది. ఉద్యమాల గడ్డ ఉస్మానియావర్సిటీ... బోరున విలపించింది. ఈ సంఘటన జరిగి 47 ఏళ్లు గడిచినా... జార్జ్ పేరు వింటే ఇంకా రోమాళ్లు నిక్కబొడుస్తాయి. అతనికి ఎందుకింత క్రేజ్... అసలు ఎవరీ జార్జ్​రెడ్డి... ఏమిటి అతని కథ.

author img

By

Published : Nov 22, 2019, 5:48 PM IST

విద్యార్థి విప్లవ తార... జార్జ్​రెడ్డి

చెగువేరాలోని తెగువ... ఐన్​స్టీన్​లోని తెలివి కలగలిపితే... జార్జ్​రెడ్డి... అని అతని సన్నిహితులు చెబుతారు. ఆయన 25 ఏళ్ల వయస్సులోనే పాఠాలు చెప్పే ప్రొఫెసర్లకు చెమటలు పట్టించారు. భౌతికశాస్త్రం, గణితంలో అంత పట్టు ఆయనకు. ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చి. అదే పిచ్చి ఫిజిక్స్​లో పీహెచ్​డీ చేయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ మెట్లు ఎక్కించింది. ఓసారి జార్జ్ పరీక్షా పేపర్లు దిద్దిన ముంబయికి చెందిన ప్రొఫెసర్... ఆయన్ని కలవడానికి ఉస్మానియాకు వచ్చారంటేనే జార్జ్‌ ప్రతిభ ఎలాంటిదో అర్థమవుతుంది. జార్జ్ బతికి ఉంటే... కచ్చితంగా భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించేవాడని ఆయన స్నేహితులు చెబుతున్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా రఘునాథ్​ రెడ్డి, కేరళకు చెందిన లీలా వర్గీస్‌ ఐదుగురు సంతానంలో జార్జ్​రెడ్డి ఒకరు. 1947, జనవరి 15న కేరళలో పాలక్కాడ్​లో జన్మించారు. 1962లో జార్జ్ కుటుంబం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. హైదరాబాద్‌లోని సెయింట్ పాల్ స్కూల్‌లో జార్జ్ చదువు మొదలైంది. పీయూసీ (ప్రస్తుతం ఇంటర్), డిగ్రీ నిజాం కాలేజీలో చదివారు. పీజీ (ఎమ్మెస్సీ ఫిజిక్స్) ఉస్మానియాలో చదివారు. పీహెచ్‌డీ కోసం ఉస్మానియాలోనే చేరారు.

జార్జ్​కు సమకాలిన అంశాలపై పట్టు ఎక్కువ. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తోటి విద్యార్థులతో చర్చించేవారు. అందరూ సమానంగా ఉండాలని ఆలోచించే జార్జ్... తనముందు జరిగే అన్యాయంపై స్పందించేవారు. ఆ గుణమే ఆయన్ని విద్యార్థి సంఘం నేతగా చేసింది. ఓసారి క్యాంపస్​లో జరిగిన చిన్న గొడవ అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ గొడవలో జార్జ్​ను ఏడాదిపాటు రస్టికేట్ చేశారు.

విశ్వవిద్యాలయం నిర్ణయం... జార్జ్‌లో మరో కోణాన్ని పరిచయం చేసింది. బహిష్కరణకు గురైన ఏడాది పాటు జార్జ్‌... పుస్తకాలతో గడిపారు. విప్లవభావాలు నరనరాన ఎక్కించుకున్నారు. అప్పుడే పీడీఎస్​యూ అనే విద్యార్థి సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘం ప్యానల్ తరఫున వర్సిటీ ఎన్నికల్లో పోటీ చేయించే స్థాయికి తీసుకొచ్చారు.

జార్జ్‌ ఎదుగుదల... పీడీఎస్‌యూ దూకుడు అప్పటి పాలకులు, కొన్ని విద్యార్థి సంఘాలకు మింగుడుపడలేదు. ఎలాగైన జార్జ్​ను అడ్డుతొలగించుకోవాలని పథకాలు వేశారు. అన్నింటినీ గుండె ధైర్యంతో ఎదుర్కొన్నారు జార్జ్. బాక్సింగ్​, మార్షల్‌ ఆర్ట్స్‌ తెలిసిన జార్జ్‌ను ఎదుర్కోవాలంటే జడుసుకునేవారు.

1972 ఏప్రిల్ 14న ఎన్నికల సమయం... ప్రత్యర్థుల పగకు... కొన్ని శక్తులు తోడైయ్యాయి. అంతే... ఇక తప్పించుకునే వీల్లేకుండా... హంతక ముఠా చుట్టుముట్టింది. ఉద్యమాల గడ్డపైనే మట్టుబెట్టింది. దాదాపు 30 మంది గూండాలు... 60 కత్తిపోట్లతో జార్జ్​ను హతమార్చారు.

ఎంత వెలుగునిచ్చే సూర్యుడైనా... సాయంత్రానికి అస్తమించాల్సిందే కదా అని అంతా అనుకున్నారు. కానీ కొందరి మదిలో మెదిలే ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానం లేదు. అసలు జార్జ్​ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది..? ఎందుకు చంపాలనుకున్నారు..? ఎన్నికలే కారణమైతే... ఉస్మానియాలో 1972కు పూర్వం అనేక ఎన్నికలు జరిగాయి. మరి అప్పుడెందుకు హత్యలు జరగలేదు..? ఇవన్నీ అనుమానాలతోనే 47 ఏళ్లు గడిచిపోయాయి.

అయినా జార్జ్ క్రేజ్ తగ్గకపోగా... పెరిగింది. జార్జ్​రెడ్డి హత్య జరిగినప్పుడు పుట్టనివారూ ... ఆయన్ను ఓ హీరోలా చూస్తున్నారు.

ఇదీ చదవండీ... జనవరి లేదా ఫిబ్రవరి నుంచి రచ్చబండ.. సీఎం జగన్​ నిర్ణయం

చెగువేరాలోని తెగువ... ఐన్​స్టీన్​లోని తెలివి కలగలిపితే... జార్జ్​రెడ్డి... అని అతని సన్నిహితులు చెబుతారు. ఆయన 25 ఏళ్ల వయస్సులోనే పాఠాలు చెప్పే ప్రొఫెసర్లకు చెమటలు పట్టించారు. భౌతికశాస్త్రం, గణితంలో అంత పట్టు ఆయనకు. ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చి. అదే పిచ్చి ఫిజిక్స్​లో పీహెచ్​డీ చేయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ మెట్లు ఎక్కించింది. ఓసారి జార్జ్ పరీక్షా పేపర్లు దిద్దిన ముంబయికి చెందిన ప్రొఫెసర్... ఆయన్ని కలవడానికి ఉస్మానియాకు వచ్చారంటేనే జార్జ్‌ ప్రతిభ ఎలాంటిదో అర్థమవుతుంది. జార్జ్ బతికి ఉంటే... కచ్చితంగా భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించేవాడని ఆయన స్నేహితులు చెబుతున్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా రఘునాథ్​ రెడ్డి, కేరళకు చెందిన లీలా వర్గీస్‌ ఐదుగురు సంతానంలో జార్జ్​రెడ్డి ఒకరు. 1947, జనవరి 15న కేరళలో పాలక్కాడ్​లో జన్మించారు. 1962లో జార్జ్ కుటుంబం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. హైదరాబాద్‌లోని సెయింట్ పాల్ స్కూల్‌లో జార్జ్ చదువు మొదలైంది. పీయూసీ (ప్రస్తుతం ఇంటర్), డిగ్రీ నిజాం కాలేజీలో చదివారు. పీజీ (ఎమ్మెస్సీ ఫిజిక్స్) ఉస్మానియాలో చదివారు. పీహెచ్‌డీ కోసం ఉస్మానియాలోనే చేరారు.

జార్జ్​కు సమకాలిన అంశాలపై పట్టు ఎక్కువ. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తోటి విద్యార్థులతో చర్చించేవారు. అందరూ సమానంగా ఉండాలని ఆలోచించే జార్జ్... తనముందు జరిగే అన్యాయంపై స్పందించేవారు. ఆ గుణమే ఆయన్ని విద్యార్థి సంఘం నేతగా చేసింది. ఓసారి క్యాంపస్​లో జరిగిన చిన్న గొడవ అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ గొడవలో జార్జ్​ను ఏడాదిపాటు రస్టికేట్ చేశారు.

విశ్వవిద్యాలయం నిర్ణయం... జార్జ్‌లో మరో కోణాన్ని పరిచయం చేసింది. బహిష్కరణకు గురైన ఏడాది పాటు జార్జ్‌... పుస్తకాలతో గడిపారు. విప్లవభావాలు నరనరాన ఎక్కించుకున్నారు. అప్పుడే పీడీఎస్​యూ అనే విద్యార్థి సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘం ప్యానల్ తరఫున వర్సిటీ ఎన్నికల్లో పోటీ చేయించే స్థాయికి తీసుకొచ్చారు.

జార్జ్‌ ఎదుగుదల... పీడీఎస్‌యూ దూకుడు అప్పటి పాలకులు, కొన్ని విద్యార్థి సంఘాలకు మింగుడుపడలేదు. ఎలాగైన జార్జ్​ను అడ్డుతొలగించుకోవాలని పథకాలు వేశారు. అన్నింటినీ గుండె ధైర్యంతో ఎదుర్కొన్నారు జార్జ్. బాక్సింగ్​, మార్షల్‌ ఆర్ట్స్‌ తెలిసిన జార్జ్‌ను ఎదుర్కోవాలంటే జడుసుకునేవారు.

1972 ఏప్రిల్ 14న ఎన్నికల సమయం... ప్రత్యర్థుల పగకు... కొన్ని శక్తులు తోడైయ్యాయి. అంతే... ఇక తప్పించుకునే వీల్లేకుండా... హంతక ముఠా చుట్టుముట్టింది. ఉద్యమాల గడ్డపైనే మట్టుబెట్టింది. దాదాపు 30 మంది గూండాలు... 60 కత్తిపోట్లతో జార్జ్​ను హతమార్చారు.

ఎంత వెలుగునిచ్చే సూర్యుడైనా... సాయంత్రానికి అస్తమించాల్సిందే కదా అని అంతా అనుకున్నారు. కానీ కొందరి మదిలో మెదిలే ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానం లేదు. అసలు జార్జ్​ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది..? ఎందుకు చంపాలనుకున్నారు..? ఎన్నికలే కారణమైతే... ఉస్మానియాలో 1972కు పూర్వం అనేక ఎన్నికలు జరిగాయి. మరి అప్పుడెందుకు హత్యలు జరగలేదు..? ఇవన్నీ అనుమానాలతోనే 47 ఏళ్లు గడిచిపోయాయి.

అయినా జార్జ్ క్రేజ్ తగ్గకపోగా... పెరిగింది. జార్జ్​రెడ్డి హత్య జరిగినప్పుడు పుట్టనివారూ ... ఆయన్ను ఓ హీరోలా చూస్తున్నారు.

ఇదీ చదవండీ... జనవరి లేదా ఫిబ్రవరి నుంచి రచ్చబండ.. సీఎం జగన్​ నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.