ETV Bharat / state

మా ఫిర్యాదులకు పరిష్కారం చూపండి: చంద్రబాబు - ఈసీ

ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వ్యత్యాసంపై ఎన్నికల సంఘం ఎందుకు ఆసక్తి చూపడం లేదని విపక్ష పార్టీలు ప్రశ్నించాయి. చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపు పూర్తి కాకుండా ముందుగానే వీవీ ప్యాట్లను లెక్కించాలని భాజపాయేతర పార్టీల నేతలు డిమాండ్ చేశారు. దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి విపక్షాలు నివేదిక అందించాయి.

మా ఫిర్యాదులకు పరిష్కారం చూపండి
author img

By

Published : May 21, 2019, 4:47 PM IST

మా ఫిర్యాదులకు పరిష్కారం చూపండి

కొన్ని రోజులుగా ఈసీకి అనేక ఫిర్యాదులు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు ఈసీకి ఏమిటి సమస్య అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలింగ్‌లో పారదర్శకత, ప్రజల్లో విశ్వాసం కల్పించడం ఈసీ బాధ్యతన్న చంద్రబాబు... తాము లేవనెత్తిన సమస్యలు చిన్నవి కావని స్పష్టం చేశారు. దీనికి ఈసీ వెంటనే పరిష్కారం చూపకుంటే మరింత పెద్దదవుతుందని హెచ్చరించారు.

ప్రతి అసెంబ్లీ స్థానంలో 5 వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని... సుప్రీంకోర్టులో ఈసీ ఇచ్చిన సమాధానం సరైంది కాదని విపక్షాలు ఆరోపించాయి. ఈవీఎంలను ట్యాంపర్‌ చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారన్న విపక్ష నేతలు... వీవీప్యాట్లు లెక్కించేందుకు ఈసీ వెనకడుగు వేయడానికి కారణాలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

వీవీప్యాట్ల కౌంటింగ్‌లో ఎందుకు నిబంధనలు రూపొందించలేదని... 5 వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో ఈసీ ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నించారు. వీవీప్యాట్ల లెక్కింపులో సమస్యలొస్తే ఈసీకి సంబంధం లేదని ఎలా చెబుతారని నిలదీశారు. ఆర్‌వో, రాష్ట్ర అధికారులను బాధ్యులను చేయాలని చూస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల వ్యత్యాసంపై ఈసీ ఎందుకు ఆసక్తి చూపడం లేదని నిలదీశారు.

చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపు పూర్తి కాకుండా ముందుగానే వీవీ ప్యాట్లను లెక్కించాలని ఈసీని విపక్షాలు కోరాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకగా జరపాలని... కౌంటింగ్ జరిగేటప్పుడు లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశాయి. లెక్కింపు ముగిసేవరకు ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, రికార్డులను కౌంటింగ్ కేంద్రంలోనే ఉంచాలని కోరాయి. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన 16.1 క్లాజును మాన్యువల్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి.

ఇదీ చదవండి...

తప్పనిసరి పరిస్థితిలో రీకౌంటింగ్​ చేస్తాం: ద్వివేది

మా ఫిర్యాదులకు పరిష్కారం చూపండి

కొన్ని రోజులుగా ఈసీకి అనేక ఫిర్యాదులు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు ఈసీకి ఏమిటి సమస్య అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలింగ్‌లో పారదర్శకత, ప్రజల్లో విశ్వాసం కల్పించడం ఈసీ బాధ్యతన్న చంద్రబాబు... తాము లేవనెత్తిన సమస్యలు చిన్నవి కావని స్పష్టం చేశారు. దీనికి ఈసీ వెంటనే పరిష్కారం చూపకుంటే మరింత పెద్దదవుతుందని హెచ్చరించారు.

ప్రతి అసెంబ్లీ స్థానంలో 5 వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని... సుప్రీంకోర్టులో ఈసీ ఇచ్చిన సమాధానం సరైంది కాదని విపక్షాలు ఆరోపించాయి. ఈవీఎంలను ట్యాంపర్‌ చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారన్న విపక్ష నేతలు... వీవీప్యాట్లు లెక్కించేందుకు ఈసీ వెనకడుగు వేయడానికి కారణాలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

వీవీప్యాట్ల కౌంటింగ్‌లో ఎందుకు నిబంధనలు రూపొందించలేదని... 5 వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో ఈసీ ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నించారు. వీవీప్యాట్ల లెక్కింపులో సమస్యలొస్తే ఈసీకి సంబంధం లేదని ఎలా చెబుతారని నిలదీశారు. ఆర్‌వో, రాష్ట్ర అధికారులను బాధ్యులను చేయాలని చూస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల వ్యత్యాసంపై ఈసీ ఎందుకు ఆసక్తి చూపడం లేదని నిలదీశారు.

చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపు పూర్తి కాకుండా ముందుగానే వీవీ ప్యాట్లను లెక్కించాలని ఈసీని విపక్షాలు కోరాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకగా జరపాలని... కౌంటింగ్ జరిగేటప్పుడు లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశాయి. లెక్కింపు ముగిసేవరకు ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, రికార్డులను కౌంటింగ్ కేంద్రంలోనే ఉంచాలని కోరాయి. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన 16.1 క్లాజును మాన్యువల్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి.

ఇదీ చదవండి...

తప్పనిసరి పరిస్థితిలో రీకౌంటింగ్​ చేస్తాం: ద్వివేది

Intro:Ap_gnt_61_21_justis_lavu_nageswararao_and_IG_avb_g4

Anchor : గ్రామీణ ప్రాంతలలోని విద్యార్థుల్లో ఉన్న నైపుణ్య తను వెలికితీయాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు కుమార్తెలు రాధిక, దీపికలు నాల్గోవ వేసవి ఉచిత శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో అశోక పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ ముగింపు సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు , ఐజీ దామోదర్ లు పాల్గొని విద్యార్థులు నేర్చుకున్న విషయాలను తిలకించారు. విద్యార్థులు వ్యర్ధాలతో తయారుచేసిన ఆకృతులను నాగేశ్వరరావు పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని, విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలని చెప్పారు.



Body:సమాజంలో జరుగుతున్న విషయాలపై విద్యార్థులు చేసిన నాటకాలు ఆలోజింపచేసేలా ఉన్నాయని ఐజీ దామోదర్ అన్నారు. బాల్యవివాహలు ప్రోత్సహించకుండా ఉండేలా వీధి నాటకాలు చేయడం సంతోషంగా ఉందన్నారు.

బైట్ : దామోదర్ , ఐజీ


Conclusion:end
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.