ETV Bharat / state

కన్నతండ్రిని గొడ్డలితో నరికి చంపిన తనయుడు

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో తల్లిని వేధిస్తున్నాడని ఓ తండ్రిని కన్న కొడుకు నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

author img

By

Published : Dec 9, 2019, 7:16 PM IST

The brutal son who killed the virgin daughter
వై.టి చెరువులో కన్నతండ్రిని గొడ్డలితో చంపిన కిరాతక కొడుకు
కన్నతండ్రినే నరికి చంపిన కుమారుడు

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వై.టి చెరువులో దారుణం జరిగింది. రోజూ మద్యం తాగి వచ్చి తల్లిని వేధిస్తున్నాడని ఓ కుమారుడు కన్న తండ్రినే గొడ్డలితో నరికి చంపాడు. గ్రామానికి చెందిన లాలెప్ప రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. మూడు రోజుల క్రితం ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కొడుకు నాగరాజు తండ్రిని మందలించాడు. దీనిపై ఆగ్రహించిన లాలప్ప మద్యం తాగి వచ్చి కొడుకును దుర్భాషలాడుతూ గొడవపడ్డాడు. వివాదం తారాస్థాయికి చేరడ వల్ల నాగరాజు విచక్షణ కోల్పోయి తండ్రిపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తండ్రి మృత దేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

కన్నతండ్రినే నరికి చంపిన కుమారుడు

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వై.టి చెరువులో దారుణం జరిగింది. రోజూ మద్యం తాగి వచ్చి తల్లిని వేధిస్తున్నాడని ఓ కుమారుడు కన్న తండ్రినే గొడ్డలితో నరికి చంపాడు. గ్రామానికి చెందిన లాలెప్ప రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. మూడు రోజుల క్రితం ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కొడుకు నాగరాజు తండ్రిని మందలించాడు. దీనిపై ఆగ్రహించిన లాలప్ప మద్యం తాగి వచ్చి కొడుకును దుర్భాషలాడుతూ గొడవపడ్డాడు. వివాదం తారాస్థాయికి చేరడ వల్ల నాగరాజు విచక్షణ కోల్పోయి తండ్రిపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తండ్రి మృత దేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:

వెంకటాపురంలో మహిళ హత్య

Contributor :R.SampathKumar center : Guntakal Dist:- ananthapur Date : 09-12-2019 Slug:AP_Atp_21_09_father_died_son_murder_Avb_ap10176 anchor:- మద్యం మత్తు లో తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని కన్న కొడుకే నరికి చంపిన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్ మడలంలోని వై.టి చెరువు గ్రామంలో చోటు చేసుకుంది..పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంతకల్ మండలం వైటి చెరువు గ్రామానికి చెందిన లాలెప్ప కు ఎనిమిది మంది సంతానం అందులో ముగ్గురు ఆడపిల్లలు కాగా ఐదు మంది కుమారులు.అయితే లాలప్ప ప్రతిరోజు మద్యం తాగి భార్య పిల్లలతో తరచూ గొడవపడేవాడు.ఈ విధంగా మద్యం తాగి గత మూడు రోజుల క్రితం భార్యతో గొడవ పడి భార్యను ఇంటి నుంచి పంపివేశాడు దీంతో తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలుసుకున్న లాలెప్ప కుమారుడు నాగరాజు బెంగళూరు నుండి వైటి చెరువు గ్రామానికి వచ్చాడు. ఈ విషయంపై కుమారుడు తన తల్లిని ఇంటినుంచి ఎందుకు పంపించివేసావని తండ్రిని మందలించాడు దీంతో తండ్రి మద్యం తాగి వచ్చి కొడుకును నానా మాటలు దుర్భాషలాడుతూ కొడుకు నాగరాజు(మైనర్ బాలుడు)తో గొడవ పడ్డాడు. ఈ గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో కోపోద్రిక్తుడైన కుమారుడు నాగరాజు(మైనర్) తండ్రి పై కట్టెలు నరుకుతున్న గొడ్డలితో అతి దారుణంగా హతమార్చాడు. దీంతో తండ్రి లాలెప్ప అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని హత్య చేసిన తీరును పరిశీలించి హత్యచేసిన నిందితుడు (కుమారుడు) నాగరాజు పరారీలో ఉండటంతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బైట్స్ : ఖాసిం సాహెబ్ (డియస్పీ,గుంతకల్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.