ETV Bharat / state

'కొత్త రాజధాని వద్దు... మమ్మల్ని కర్ణాటకలో కలపండి' - అమరావతి రైతుల ఆందోళన

మడకశిర నియోజకవర్గాన్ని కర్ణాటక రాష్ట్రంలో చేర్చాలని ప్రజలు, తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. విశాఖను రాజధానిగా చేస్తే తాము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.

'merge our constituency in karnataka' madakasira people demands
తెదేపా ఆందోళన
author img

By

Published : Dec 23, 2019, 7:18 PM IST

మడకశిరలో తెదేపా నిరసన

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ప్రజలు, తెదేపా నాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ నియోజకవర్గాన్ని కర్ణాటక రాష్ట్రంలో కలపాలని కోరారు. ఈ మేరకు స్పందన కార్యక్రమంలో ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తెదేపా మాజీ ఎమ్మెల్యే ఈరన్న... ప్రస్తుత ముఖ్యమంత్రి పరిపాలన తుగ్లక్ పాలనకు నిదర్శనంగా మారిందని అన్నారు.

'మడకశిర నియోజకవర్గం నుంచి విశాఖ దాదాపు 1200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు విశాఖపట్టణాన్ని రాజధానిగా ప్రకటిస్తే మేము అక్కడికి చేరుకోవాలంటేనే రెండు రోజులు పడుతుంది. బెంగళూరు మహా నగరం కేవలం 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. మడకశిర నియోజకవర్గ ప్రాంతాన్ని కర్ణాటక రాష్ట్ర భూభాగంలో కలిపితే మాకు కష్టాలు ఉండవు' అని ఈరన్న అన్నారు. లేదంటే అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి:మా ఎమ్మెల్యే కనిపించడం లేదు.. వెతకండి సార్!

మడకశిరలో తెదేపా నిరసన

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ప్రజలు, తెదేపా నాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ నియోజకవర్గాన్ని కర్ణాటక రాష్ట్రంలో కలపాలని కోరారు. ఈ మేరకు స్పందన కార్యక్రమంలో ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తెదేపా మాజీ ఎమ్మెల్యే ఈరన్న... ప్రస్తుత ముఖ్యమంత్రి పరిపాలన తుగ్లక్ పాలనకు నిదర్శనంగా మారిందని అన్నారు.

'మడకశిర నియోజకవర్గం నుంచి విశాఖ దాదాపు 1200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు విశాఖపట్టణాన్ని రాజధానిగా ప్రకటిస్తే మేము అక్కడికి చేరుకోవాలంటేనే రెండు రోజులు పడుతుంది. బెంగళూరు మహా నగరం కేవలం 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. మడకశిర నియోజకవర్గ ప్రాంతాన్ని కర్ణాటక రాష్ట్ర భూభాగంలో కలిపితే మాకు కష్టాలు ఉండవు' అని ఈరన్న అన్నారు. లేదంటే అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి:మా ఎమ్మెల్యే కనిపించడం లేదు.. వెతకండి సార్!

Intro:మడకశిర నియోజకవర్గాన్ని కర్ణాటక రాష్ట్రంలో చేర్చాలని ప్రజలు తెదేపా నాయకులు ఆందోళన చేశారు.


Body:అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ప్రజలు మరియు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈరన్న, నాయకులు తాసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి అమరావతినే రాజధానిగ కొనసాగించాలి నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్పందన కార్యక్రమంలొ ఎమ్మార్వో కు వినతిపత్రం సమర్పించారు.


Conclusion:నాయకులు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం మడకశిర నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలో కలపాలని ఉద్యమాలు జరిగాయి. అప్పట్లో పెద్దలు అంగీకారంతో మడకశిర నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో చేరింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి పరిపాలన తుగ్లక్ పాలన కు నిదర్శనంగా రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే ప్రయత్నంలో ఉంది. విశాఖపట్నం రాజధాని ప్రకటిస్తే ఈ నియోజకవర్గం నుండి విశాఖ దాదాపు 1200 కిలోమీటర్ల దూరం అవుతుంది. కాబట్టి మాకు బెంగళూరు మహా నగరం కేవలం 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున మడకశిర నియోజకవర్గ ప్రాంతాన్ని కర్ణాటక రాష్ట్ర భూభాగంలో కలిపి మా చిరకాల కోరికను తీర్చాలి లేదా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

బైట్స్ 1 : ఈరన్న, మాజీ ఎమ్మెల్యే, మడకశిర.

బైట్స్ 2 : శ్రీనివాస మూర్తి, మాజీ జెడ్పిటిసి, గుడిబండ మండలం, మడకశిర నియోజకవర్గం.



యు. నాసిర్ ఖాన్, ఈటీవీ భారత్ రిపోర్టర్, మడకశిర, అనంతపురం జిల్లా.


మొబైల్ నెంబర్. : 8019247116.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.