అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ఓ లారీ ప్రమాదానికి గురై డివైడర్ పైకి ఎక్కింది. డ్రైవర్ నిద్రమత్తులో జోగుతూ నడపడం వల్ల ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో లారీ ముందు భాగం నుజ్జయింది. ఈ వాహనం కర్ణాటక నుంచి కడపకు వెళ్తున్నట్లు గుర్తించారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి: