అనంతపురం జిల్లా పాలవాయి గ్రామ సమీపంలో గంగన్న అనే రైతు వన్యప్రాణుల నుంచి పంటను కాపాడుకోవడానికి వినూత్నంగా అలోచించి తన పొలం చుట్టూ రంగు రంగుల చీరలు కట్టాడు. తమ పొలం పక్కనే కొండ ఉందని.. అక్కడి నుంచి ఎలుగుబంట్లు, అడవి పందులు మూకుమ్మడిగా వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా చీరలు కట్టడం వల్ల కొంతైనా అడవి జంతువుల బాధ తప్పుతుందని చెబుతున్నాడు.
ఇదీ చదవండి: ఈ రహదారిపై ప్రయాణం... ప్రమాదాలకు ఆస్కారం...!