ప్రభాస్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'జిల్'తో ప్రతిభ చాటుకున్న రాధాకృష్ణ దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్. హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ ఎస్.రవీందర్ రెడ్డి ప్రత్యేకమైన సెట్ను తీర్చిదిద్దారు. ఎకరం విస్తీర్ణంలో ఓ విశాలమైన చెరువు, అందులో ఓ పడవను సృష్టించారు. ఇందులోనే ప్రభాస్ - పూజలపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. నాలుగైదు రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరగనుంది. ఆ తరవాత రైలు నేపథ్యంలో మరి కొన్ని దృశ్యాల్ని తెరకెక్కిస్తారు.
![hero prabhas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6030059_prabhas-1.jpg)