ETV Bharat / city

'రాష్ట్రంలో యురేనియం తవ్వకాలు వెంటనే నిలిపివేయాలి' - stop uranium mining

సీఎం జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో యురేనియం తవ్వకాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ఎందుకు పట్టించుకోవడం లేదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ ప్రశ్నించారు. యురేనియం తవ్వకాలు మానవ మనుగడకు ప్రమాదకరమన్న ఆయన... తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

'రాష్ట్రంలో యురేనియం తవ్వకాలు వెంటనే నిలిపివేయాలి'
author img

By

Published : Oct 24, 2019, 10:31 PM IST

'రాష్ట్రంలో యురేనియం తవ్వకాలు వెంటనే నిలిపివేయాలి'

రాష్ట్రంలో యురేనియం తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలో పర్యటించిన ఆయన ఎంబీ భవన్​లో నిర్వహించిన యురేనియం బాధితుల సభలో పాల్గొన్నారు. కడప జిల్లా తుమ్మలపల్లి సమీప గ్రామాల్లో ఇటీవల పర్యటించిన అధ్యయన బృందం బాధితుల కష్టాలపై తీసిన వీడియోలను వీక్షించిన జస్టిస్​ గోపాలగౌడ... జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మానవాళి మనుగడకే ప్రమాదం

యురేనియం తవ్వకాల వల్ల మానవాళి మనుగడే ప్రమాదకరంగా మారిందని జస్టిస్​ గోపాలగౌడ్​ అన్నారు. కడప జిల్లా తుమ్మలపల్లిలోని యురేనియం పరిశ్రమ వల్ల ప్రజలు భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారని... నిబంధనలు పాటించని సదరు సంస్థపై సీఎం జగన్​ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యురేనియం బాధితులను హైదరాబాద్ తరలించి సత్వరం మెరుగైన చికిత్స అందించాలని... లేకుంటే తామంతా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన రాజ్యాంగ విరుద్ధమని.. సర్పంచ్​ల పదవీ కాలం పూర్తి కాకముందే ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.

ఇదీ చదవండి :

'ప్రాణాలు పోతున్నా యూసీఐఎల్​పై చర్యలేవీ...?'

'రాష్ట్రంలో యురేనియం తవ్వకాలు వెంటనే నిలిపివేయాలి'

రాష్ట్రంలో యురేనియం తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలో పర్యటించిన ఆయన ఎంబీ భవన్​లో నిర్వహించిన యురేనియం బాధితుల సభలో పాల్గొన్నారు. కడప జిల్లా తుమ్మలపల్లి సమీప గ్రామాల్లో ఇటీవల పర్యటించిన అధ్యయన బృందం బాధితుల కష్టాలపై తీసిన వీడియోలను వీక్షించిన జస్టిస్​ గోపాలగౌడ... జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మానవాళి మనుగడకే ప్రమాదం

యురేనియం తవ్వకాల వల్ల మానవాళి మనుగడే ప్రమాదకరంగా మారిందని జస్టిస్​ గోపాలగౌడ్​ అన్నారు. కడప జిల్లా తుమ్మలపల్లిలోని యురేనియం పరిశ్రమ వల్ల ప్రజలు భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారని... నిబంధనలు పాటించని సదరు సంస్థపై సీఎం జగన్​ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యురేనియం బాధితులను హైదరాబాద్ తరలించి సత్వరం మెరుగైన చికిత్స అందించాలని... లేకుంటే తామంతా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన రాజ్యాంగ విరుద్ధమని.. సర్పంచ్​ల పదవీ కాలం పూర్తి కాకముందే ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.

ఇదీ చదవండి :

'ప్రాణాలు పోతున్నా యూసీఐఎల్​పై చర్యలేవీ...?'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.