ETV Bharat / city

మాధ్యమం ఎంచుకునే అవకాశం విద్యార్థులకే ఇవ్వండి - జేడీ లక్ష్మినారాయణ తాజా వార్తలు

ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటే వారిలో సృజనాత్మకత పెరుగుతందని జనసేన నేత లక్ష్మీనారాయణ అన్నారు. తెలుగు భాష పరిరక్షణకై మాతృభాష మాధ్యమ ఐక్య కార్యాచరణ సమితి ఏర్పడింది. దీనికి అధ్యక్షునిగా జనసేన నేత ఎన్నికయ్యారు.

మాధ్యమం ఎంచుకునే అవకాశం విద్యార్థులకే ఇవ్వండి
మాధ్యమం ఎంచుకునే అవకాశం విద్యార్థులకే ఇవ్వండి
author img

By

Published : Dec 20, 2019, 7:44 AM IST

మాధ్యమం ఎంచుకునే అవకాశం విద్యార్థులకే ఇవ్వండి

ఏ మాధ్యమం చదువుకోవాలో ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకే ఇవ్వాలని జనసేన నేత లక్ష్మీనారాయణ అన్నారు. తెలుగుభాషా పరిరక్షణకై "మాతృభాషా మాధ్యమ ఐక్యకార్యాచరణ సమితి" ఏర్పడింది. సమితి అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణని నియమిస్తున్నట్లు సభ్యులు ప్రకటించారు. అనంతరం సమితి కార్యాచరణ కరపత్రాన్ని లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ప్రాథమిక విద్య... మాతృభాషలో ఉంటేనే విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. ఇదే విషయాన్ని ప్రపంచంలోని అనేక పరిశోధనలు తెలిపాయని వివరించారు. మాతృభాషలో విద్యాభ్యాసం ద్వారానే భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా తయారు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. దశల వారీగా ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు.

మాధ్యమం ఎంచుకునే అవకాశం విద్యార్థులకే ఇవ్వండి

ఏ మాధ్యమం చదువుకోవాలో ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకే ఇవ్వాలని జనసేన నేత లక్ష్మీనారాయణ అన్నారు. తెలుగుభాషా పరిరక్షణకై "మాతృభాషా మాధ్యమ ఐక్యకార్యాచరణ సమితి" ఏర్పడింది. సమితి అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణని నియమిస్తున్నట్లు సభ్యులు ప్రకటించారు. అనంతరం సమితి కార్యాచరణ కరపత్రాన్ని లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ప్రాథమిక విద్య... మాతృభాషలో ఉంటేనే విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. ఇదే విషయాన్ని ప్రపంచంలోని అనేక పరిశోధనలు తెలిపాయని వివరించారు. మాతృభాషలో విద్యాభ్యాసం ద్వారానే భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా తయారు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. దశల వారీగా ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు.

ఇదీ చదవండి :

పింగళి జయంతిని ఘనంగా నిర్వహిస్తాం: లక్ష్మీనారాయణ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.