ETV Bharat / city

విశాఖ టు విజయవాడ... వయా యువత..!

author img

By

Published : Dec 10, 2019, 2:57 PM IST

యువత లక్ష్యం మరచి... మత్తులో జోగుతోంది. నగదు కోసం... స్మగ్లర్లు యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా... అక్రమరవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తల్లిదండ్రులు పర్యవేక్షణ లోపంతో రేపటితరం గంజాయికి బానిసలవుతున్నారు.

ganjai effects youth life
గంజాయితో చెడిపోతున్న యువత
విశాఖ టు విజయవాడ... వయా యువత..!

విశాఖ మన్యంలో సాగవుతున్న గంజాయి విక్రయానికి రాజధాని ప్రాంతం వేదికగా మారుతోంది. విజయవాడ శివారు ప్రాంతాలు, ఇతర పట్టణాల్లో గంజాయి విక్రయాలు గుట్టుగా సాగుతున్నాయి. కొంతమంది ముఠాగా ఏర్పడి... విశాఖ జిల్లా నర్సీపట్నం, పాడేరు, చింతపల్లి నుంచి తీసుకొచ్చిన గంజాయిని విజయవాడ సహా జిల్లా అంతటా సరఫరా చేస్తున్నారు. నగరాలు, పట్టణాల నుంచి ఈ సంస్కృతి క్రమంగా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తోంది.

పెద్దగా జనసంచారం లేని ప్రాంతాలు, జాతీయ రహదారి పక్కన ఉండే హోటళ్లు, రైల్వేగేటు ప్రాంతాల్లో గంజాయి గుప్పుమంటోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గంజాయిని విజయవాడ, మైలవరం, ఇబ్రహీంపట్నం, తాడేపల్లి, కోదాడ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో అమ్ముతున్నారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 2 వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం వికృత వ్యాపార జోరుకు నిదర్శనం.

ఖరీదైన కొకైన్ సంస్కృతీ రాజధాని ప్రాంతానికి పాకింది. యువత, విద్యార్థులే లక్ష్యంగా విక్రయాలు కొనసాగుతున్నాయని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు ఆందోళన వ్యక్తపరిచారు. గంజాయి రవాణా పోలీసుల కంటపడకుండా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్సైజ్, పోలీసులు, డీఆర్‌ఐ అధికారులు సమన్వయంతో పనిచేసి... ఈ మత్తు మహమ్మారి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని... పిల్లలపై పర్యవేక్షణ పెంచాలని పోలీసులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి

కిలో ప్లాస్టిక్​కు... అరకిలో స్వీట్స్​, 6 గుడ్లు..!

విశాఖ టు విజయవాడ... వయా యువత..!

విశాఖ మన్యంలో సాగవుతున్న గంజాయి విక్రయానికి రాజధాని ప్రాంతం వేదికగా మారుతోంది. విజయవాడ శివారు ప్రాంతాలు, ఇతర పట్టణాల్లో గంజాయి విక్రయాలు గుట్టుగా సాగుతున్నాయి. కొంతమంది ముఠాగా ఏర్పడి... విశాఖ జిల్లా నర్సీపట్నం, పాడేరు, చింతపల్లి నుంచి తీసుకొచ్చిన గంజాయిని విజయవాడ సహా జిల్లా అంతటా సరఫరా చేస్తున్నారు. నగరాలు, పట్టణాల నుంచి ఈ సంస్కృతి క్రమంగా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తోంది.

పెద్దగా జనసంచారం లేని ప్రాంతాలు, జాతీయ రహదారి పక్కన ఉండే హోటళ్లు, రైల్వేగేటు ప్రాంతాల్లో గంజాయి గుప్పుమంటోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గంజాయిని విజయవాడ, మైలవరం, ఇబ్రహీంపట్నం, తాడేపల్లి, కోదాడ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో అమ్ముతున్నారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 2 వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం వికృత వ్యాపార జోరుకు నిదర్శనం.

ఖరీదైన కొకైన్ సంస్కృతీ రాజధాని ప్రాంతానికి పాకింది. యువత, విద్యార్థులే లక్ష్యంగా విక్రయాలు కొనసాగుతున్నాయని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు ఆందోళన వ్యక్తపరిచారు. గంజాయి రవాణా పోలీసుల కంటపడకుండా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్సైజ్, పోలీసులు, డీఆర్‌ఐ అధికారులు సమన్వయంతో పనిచేసి... ఈ మత్తు మహమ్మారి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని... పిల్లలపై పర్యవేక్షణ పెంచాలని పోలీసులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి

కిలో ప్లాస్టిక్​కు... అరకిలో స్వీట్స్​, 6 గుడ్లు..!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.