ETV Bharat / city

మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించనున్న జగన్

రాష్ట్రంలో 73వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబయింది. ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం రాష్ట్ర పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఆ తరువాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. విశిష్ట సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు మెడల్స్, అవార్డులు ప్రదానం చేయనున్నారు. వివిధ జిల్లాల్లో ఇంఛార్జ్ మంత్రులు జెండా వందన కార్యక్రమంలో పాల్గొంటారు.

author img

By

Published : Aug 15, 2019, 2:43 AM IST

మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించనున్న జగన్
మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించనున్న జగన్

ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్​మోహన్ రెడ్డి తొలిసారి మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. 73వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటలకు జెండా వందన వేదిక ప్రాంగణానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి... పోలీసు సిబ్బంది నుంచి రాష్ట్రీయ సెల్యూట్ స్వీకరిస్తారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఏపీఎస్పీ బెటాలియన్ సహా వివిధ పోలీసు విభాగాలు, ఇతర రాష్ట్ర పోలీసు కంటింజెట్, ఎన్​సీసీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరేడ్​ను సమీక్షించి... వారి నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు.

విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉద్యోగులకు పంద్రాగస్టు సందర్భంగా సీఎం జగన్ అవార్డులు, మెడల్స్​ ప్రదానం చేయనున్నారు. 10గంటలకు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నవరత్నాల అమలు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, ఉపాధి కల్పన, విద్యా వ్యవస్థలో ఫీజుల నియంత్రణ కోసం సంస్కరణలు, ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ కమిషన్, రైతు భరోసా-కౌలు రైతులకూ ప్రయోజనం కల్పించేలా చట్టం చేయడం, కొత్త పరిశ్రమల విధానం... తదితర అంశాల గురించి తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు. 11గంటలకు పరేడ్ ముగిశాక సీఎం హైదరాబాద్ వెళ్తారు.

జిల్లాల్లో మంత్రులు...
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఇంఛార్జ్​ మంత్రులు జాతీయజెండాను ఆవిష్కరించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరంలో ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, విశాఖలో మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, తూర్పుగోదావరిలో డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లాలో పిల్లి సుభాష్ చంద్రబోస్, గుంటూరులో రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ప్రకాశం జిల్లాలో జలవనరుల శాఖ మంత్రి అనిల్​కుమార్​ యాదవ్, నెల్లూరులో హోంమంత్రి మేకతోటి సుచరిత, కర్నూలులో బొత్స సత్యనారాయణ, కడప జిల్లాలో డిప్యూటీ సీఎం షేక్ అమ్జద్ భాష, అనంతపురం జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామి స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.

ఇదీ చదవండీ...

ప్రభుత్వం ఉందనే భరోసా రైతులకివ్వాలి: సీఎం

మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించనున్న జగన్

ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్​మోహన్ రెడ్డి తొలిసారి మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. 73వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటలకు జెండా వందన వేదిక ప్రాంగణానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి... పోలీసు సిబ్బంది నుంచి రాష్ట్రీయ సెల్యూట్ స్వీకరిస్తారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఏపీఎస్పీ బెటాలియన్ సహా వివిధ పోలీసు విభాగాలు, ఇతర రాష్ట్ర పోలీసు కంటింజెట్, ఎన్​సీసీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరేడ్​ను సమీక్షించి... వారి నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు.

విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉద్యోగులకు పంద్రాగస్టు సందర్భంగా సీఎం జగన్ అవార్డులు, మెడల్స్​ ప్రదానం చేయనున్నారు. 10గంటలకు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నవరత్నాల అమలు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, ఉపాధి కల్పన, విద్యా వ్యవస్థలో ఫీజుల నియంత్రణ కోసం సంస్కరణలు, ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ కమిషన్, రైతు భరోసా-కౌలు రైతులకూ ప్రయోజనం కల్పించేలా చట్టం చేయడం, కొత్త పరిశ్రమల విధానం... తదితర అంశాల గురించి తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు. 11గంటలకు పరేడ్ ముగిశాక సీఎం హైదరాబాద్ వెళ్తారు.

జిల్లాల్లో మంత్రులు...
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఇంఛార్జ్​ మంత్రులు జాతీయజెండాను ఆవిష్కరించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరంలో ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, విశాఖలో మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, తూర్పుగోదావరిలో డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లాలో పిల్లి సుభాష్ చంద్రబోస్, గుంటూరులో రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ప్రకాశం జిల్లాలో జలవనరుల శాఖ మంత్రి అనిల్​కుమార్​ యాదవ్, నెల్లూరులో హోంమంత్రి మేకతోటి సుచరిత, కర్నూలులో బొత్స సత్యనారాయణ, కడప జిల్లాలో డిప్యూటీ సీఎం షేక్ అమ్జద్ భాష, అనంతపురం జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామి స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.

ఇదీ చదవండీ...

ప్రభుత్వం ఉందనే భరోసా రైతులకివ్వాలి: సీఎం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.