ETV Bharat / city

నిరీక్షణ ఫలించింది... తల్లిదండ్రుల ఆచూకీ దొరికింది..! - 13 ఏళ్ల తరువాత తల్లిదండ్రుల చెంతకి చేరింది

ఏడేళ్ల వయసులో చదువుకోనని మారాం చేస్తే తల్లి కొట్టింది. అమ్మ మీద కోపంతో ఇంట్లోంచి పారిపోయి విజయవాడ బస్టాండ్‌లో ఒంటరిగా తిరుగుతుంటే... ఓ మహిళ ఓదార్చింది. 500 రూపాయలకు వేరొకరికి అమ్మేసింది. అమ్మ గుర్తొచ్చినా తిరిగి ఇంటికి రాలేని పరిస్థితి. దాదాపు 13 ఏళ్ల తరువాత కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆమెకు తల్లిదండ్రుల ఆచూకీ లభించింది. ఈ విషాద కథ సుఖాంతమైంది.

adilaxmi-reached-her-parents-in-vijayawada
adilaxmi-reached-her-parents-in-vijayawada
author img

By

Published : Dec 10, 2019, 2:46 PM IST

Updated : Dec 10, 2019, 6:22 PM IST

నిరీక్షణ ఫలించింది.. తల్లిదండ్రుల ఆచూకీ లభించింది

ఆదిలక్ష్మి మూడో తరగతి చదువుతున్నప్పుడు... బడికెళ్లనని మారాం చేసింది. తనని తల్లి కోప్పడింది. అమ్మమీద అలిగి ఇంట్లోంచి పారిపోయింది ఆదిలక్ష్మి. విజయవాడ బస్టాండ్‌లో తిరుగుతున్న ఆదిలక్ష్మిని ఓ మహిళ చెన్నై తీసుకెళ్లింది. అక్కడే మధురిమ అనే మహిళకు 500 రూపాయలకు అమ్మేసింది. మధురిమ ఆదిలక్ష్మిని లత అని పేరు పెట్టి కన్నకూతురిలా పెంచింది.

18 ఏళ్లు దాటాక మధురైకిి చెందిన కాంచీవరంతో వివాహం జరిపించింది. భర్త చెంత సంతోషంగా గడుపుతున్న లతకు తల్లిదండ్రులు గుర్తొచ్చారు. ఆ విషయం భర్తకు చెప్పాక... అన్వేషణ ప్రారంభమైంది. ముందుగా చెన్నైలోని లాయర్‌ సాయం తీసుకుంది ఆదిలక్ష్మి. ఆయన ఇచ్చిన సూచనతో విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భర్తతో సహా వచ్చి ఫిర్యాదు చేసింది. పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావును కలసి తనకు సాయం చేయాలని కోరింది.

దాదాపు 13 ఏళ్ల తరువాత కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆమెకు తల్లిదండ్రుల ఆచూకీ లభించటంతో... కథ సుఖాంతమైంది. కళ్లల్లో ఆనందభాష్పాలు, ఆలింగనాలతో ఆ కుటుంబంలో సంతోషం నిండిపోయింది.

ఇవి కూడా చదవండి:

రేపు రాజ్యసభకు పౌరసత్వ బిల్లు- ఆమోదంపై భాజపా ధీమా

నిరీక్షణ ఫలించింది.. తల్లిదండ్రుల ఆచూకీ లభించింది

ఆదిలక్ష్మి మూడో తరగతి చదువుతున్నప్పుడు... బడికెళ్లనని మారాం చేసింది. తనని తల్లి కోప్పడింది. అమ్మమీద అలిగి ఇంట్లోంచి పారిపోయింది ఆదిలక్ష్మి. విజయవాడ బస్టాండ్‌లో తిరుగుతున్న ఆదిలక్ష్మిని ఓ మహిళ చెన్నై తీసుకెళ్లింది. అక్కడే మధురిమ అనే మహిళకు 500 రూపాయలకు అమ్మేసింది. మధురిమ ఆదిలక్ష్మిని లత అని పేరు పెట్టి కన్నకూతురిలా పెంచింది.

18 ఏళ్లు దాటాక మధురైకిి చెందిన కాంచీవరంతో వివాహం జరిపించింది. భర్త చెంత సంతోషంగా గడుపుతున్న లతకు తల్లిదండ్రులు గుర్తొచ్చారు. ఆ విషయం భర్తకు చెప్పాక... అన్వేషణ ప్రారంభమైంది. ముందుగా చెన్నైలోని లాయర్‌ సాయం తీసుకుంది ఆదిలక్ష్మి. ఆయన ఇచ్చిన సూచనతో విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భర్తతో సహా వచ్చి ఫిర్యాదు చేసింది. పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావును కలసి తనకు సాయం చేయాలని కోరింది.

దాదాపు 13 ఏళ్ల తరువాత కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆమెకు తల్లిదండ్రుల ఆచూకీ లభించటంతో... కథ సుఖాంతమైంది. కళ్లల్లో ఆనందభాష్పాలు, ఆలింగనాలతో ఆ కుటుంబంలో సంతోషం నిండిపోయింది.

ఇవి కూడా చదవండి:

రేపు రాజ్యసభకు పౌరసత్వ బిల్లు- ఆమోదంపై భాజపా ధీమా

sample description
Last Updated : Dec 10, 2019, 6:22 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.