.
తిరుమలలో వైభవంగా ప్రణయకలహోత్సవ వేడుకలు
తిరుమల శ్రీవారు శ్రీదేవీ, భూదేవిలతో పాల్గొనే కలహ శృంగార భరితమైన ఉత్సవమే ప్రణయకలహోత్సవం. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరవరోజున ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకను తితిదే వైభవంగా నిర్వహించింది. స్వామివారు దేవేరులతో కలసి వైభవోత్సవ మండపం నుంచి బంగారు పల్లకిపై వరాహస్వామి వారి ఆలయం వద్దకు ఊరేగింపుగా చేరుకున్నారు. ఈ సమయంలో అర్చకులు, ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల తరఫున అర్చకులు పూలబంతులను విసరడం వంటి సన్నివేశాలను నిర్వహించారు. ఉత్సవంలో పాల్గొని భక్తులు పులకించారు.
తిరుమలలో వైభవంగా ప్రణయకలహోత్సవం వేడుకలు
.
sample description