ETV Bharat / city

'దిశ ఎన్​కౌంటర్​ను సీఎం సమర్థించటం రాజ్యాంగ విరుద్ధం' - mrps madha krishna respond on jagan comments on disha

దిశ నిందితులను ఎన్​కౌంటర్​ను సీఎం జగన్ సమర్థించటం... రాజ్యాంగాన్ని అవమానించడమే అని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఇది సరైన నిర్ణయమని భావిస్తే... అన్ని అత్యాచార కేసులకు ఇలాంటి ధోరణినే అవలంభించాలని ఆయన సూచించారు.

mrps mandha krishana madiga respond
'దిశ ఎన్​కౌంటర్​ను సీఎం సమర్థించటం...రాజ్యాంగ విరుద్ధం'
author img

By

Published : Dec 14, 2019, 6:59 PM IST

'దిశ ఎన్​కౌంటర్​ను సీఎం సమర్థించటం...రాజ్యాంగ విరుద్ధం'
దిశ నిందితుల ఎన్​కౌంటర్​ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్థించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఇది న్యాయమని భావిస్తే తెలుగు రాష్ట్రాల్లో సామూహిక అత్యాచారానికి గురైన ఎంతో మంది బాలికలు ఉన్నారని... ఆ కేసుల్లో నిందితులు ప్రధానంగా ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని గుర్తు చేశారు. దిశ చట్టం తీసుకొచ్చినట్లుగానే ... అవినీతిపరులకు త్వరితగతిన కఠిన శిక్ష పడేలా జగన్ చట్టం తీసుకు వస్తారా అని మందకృష్ణ ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం వస్తే అవినీతిపరులకు శిక్ష పడే చట్టాన్ని తీసుకు రావాలని కోరుతానని అన్నారు.

ఇవీ చూడండి:

'కఠిన శిక్షలు అమలు చేసినప్పుడే అత్యాచారాలకు కళ్లెం'

'దిశ ఎన్​కౌంటర్​ను సీఎం సమర్థించటం...రాజ్యాంగ విరుద్ధం'
దిశ నిందితుల ఎన్​కౌంటర్​ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్థించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఇది న్యాయమని భావిస్తే తెలుగు రాష్ట్రాల్లో సామూహిక అత్యాచారానికి గురైన ఎంతో మంది బాలికలు ఉన్నారని... ఆ కేసుల్లో నిందితులు ప్రధానంగా ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని గుర్తు చేశారు. దిశ చట్టం తీసుకొచ్చినట్లుగానే ... అవినీతిపరులకు త్వరితగతిన కఠిన శిక్ష పడేలా జగన్ చట్టం తీసుకు వస్తారా అని మందకృష్ణ ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం వస్తే అవినీతిపరులకు శిక్ష పడే చట్టాన్ని తీసుకు రావాలని కోరుతానని అన్నారు.

ఇవీ చూడండి:

'కఠిన శిక్షలు అమలు చేసినప్పుడే అత్యాచారాలకు కళ్లెం'

Intro:AP_RJY_96_14_MANDHA KRISHNA MADIGA_PRESS MEET_AVB_AP10166
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని ప్రెస్క్లబ్ లో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శనివారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులను ,ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్థించడం రాజ్యాంగాన్ని అవమానించడమే అన్నారు. ఇది న్యాయమని భావిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో సామూహిక అత్యాచారానికి గురైన ఎంతో మంది బాలికలు ఉన్నారని, ఆ కేసుల్లో నిందితులు ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని గుర్తు చేశారు. దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసినట్లే వారి విషయంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి అదే నిర్ణయం తీసుకుంటారా అని ప్రశ్నించారు. దిశ చట్టం తీసుకు వచ్చినట్లుగా అవినీతిపరులకు త్వరితగతిన కఠిన శిక్ష పడే విధంగా జగన్మోహన్ రెడ్డి చట్టం తీసుకు వస్తారా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం వస్తే అవినీతిపరులకు శిక్ష పడే చట్టాన్ని తీసుకు రావాలని కోరుతానని అన్నారు .దేశంలో అవినీతి మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోదీయేనని అన్నారు. అందుకే ఆయన్ని గౌరవిస్తానన్నారు.


Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం


Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.