ETV Bharat / city

అమరావతి కోసం... అన్నదాతల వాహన ర్యాలీ

author img

By

Published : Jan 29, 2020, 11:24 AM IST

అమరావతి కోసం రాజధాని ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు 43వ రోజుకు చేరాయి. ఈ నిరసనలో భాగంగా రైతులు 29 గ్రామాల మీదుగా భారీ వాహన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో పాల్గొనేందుకు రైతులు, రైతుకూలీలు, మహిళలు భారీగా తరలివచ్చారు.

Tulluru farmers vehicles rally for amaravathi
అమరావతి కోసం... అన్నదాతల వాహన ర్యాలీ
అమరావతి కోసం... అన్నదాతల వాహన ర్యాలీ
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు భారీ వాహన ర్యాలీ చేపట్టారు. బైకులు, కార్లు, ట్రాక్టర్లతో రాజధాని గ్రామాల్లో ర్యాలీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. ఇందులో పాల్గొనేందుకు ఆయా గ్రామాల ప్రధాన కూడళ్ల వద్దకు రైతులు చేరుకున్నారు. మందడంలో వాహనాలు ఎక్కువగా రావడం వలన పోలీసులు అప్రమత్తమయ్యారు. సచివాలయానికి వెళ్లే మార్గం అయినందువల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
అమరావతి కోసం... అన్నదాతల వాహన ర్యాలీ

తుళ్లూరులో ప్రారంభమైన ర్యాలీ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో కొనసాగనుంది. రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, మోదులింగాయపాలెం, వెలగపూడి, మల్కాపురం, మందడం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ, పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, హరిచంద్రపురం, బోరుపాలెం, దొండపాడు గ్రామాల మీదుగా తిరిగి తుళ్లూరు చేరుకోనుంది. ర్యాలీలో పాల్గొనేందుకు రైతులు వేలాదిగా తరలివస్తున్నారు. దీని ద్వారా అమరావతి ఆకాంక్షను బలంగా చాటాలని రైతులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి : అమరావతిలో.. మరో గుండె ఆగింది!

అమరావతి కోసం... అన్నదాతల వాహన ర్యాలీ
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు భారీ వాహన ర్యాలీ చేపట్టారు. బైకులు, కార్లు, ట్రాక్టర్లతో రాజధాని గ్రామాల్లో ర్యాలీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. ఇందులో పాల్గొనేందుకు ఆయా గ్రామాల ప్రధాన కూడళ్ల వద్దకు రైతులు చేరుకున్నారు. మందడంలో వాహనాలు ఎక్కువగా రావడం వలన పోలీసులు అప్రమత్తమయ్యారు. సచివాలయానికి వెళ్లే మార్గం అయినందువల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
అమరావతి కోసం... అన్నదాతల వాహన ర్యాలీ

తుళ్లూరులో ప్రారంభమైన ర్యాలీ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో కొనసాగనుంది. రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, మోదులింగాయపాలెం, వెలగపూడి, మల్కాపురం, మందడం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ, పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, హరిచంద్రపురం, బోరుపాలెం, దొండపాడు గ్రామాల మీదుగా తిరిగి తుళ్లూరు చేరుకోనుంది. ర్యాలీలో పాల్గొనేందుకు రైతులు వేలాదిగా తరలివస్తున్నారు. దీని ద్వారా అమరావతి ఆకాంక్షను బలంగా చాటాలని రైతులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి : అమరావతిలో.. మరో గుండె ఆగింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.