ETV Bharat / city

తాత్కాలిక డ్రైవర్​ను చితకబాదిన టీఎస్ ఆర్టీసీ కార్మికులు - telangana rtc employees strike 2019

మహిళా కండక్టర్లతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ... తాత్కాలిక డ్రైవర్​ను టీఎస్ ఆర్టీసీ కార్మికులు చితకబాదారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

తాత్కాలిక డ్రైవర్​పై దాడి
author img

By

Published : Oct 29, 2019, 6:44 PM IST

తాత్కాలిక డ్రైవర్​పై దాడి

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన సాయి... టీఎస్ ఆర్టీసీలో తాత్కాలిక డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. విధుల్లో ఉన్న అతను తమ వైపు చేయి చూపిస్తూ... అసభ్యకరంగా ప్రవర్తించాడని కొందరు మహిళా కండక్టర్లు ఆరోపించారు. మణుగూరు డిపోలో ఆందోళన చేస్తున్న కార్మికులకు విషయం చెప్పారు. ఆర్టీసీ కార్మికులు.. సాయిని అసభ్య పదజాలంతో దూషిస్తూ... దాడికి దిగారు. సమాచారం తెలుసుకున్న సీఐ సంఘటనాస్థలికి చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. మహిళా కండక్టర్లు, తాత్కాలిక డ్రైవర్​ పోలీస్​స్టేషన్​లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

తాత్కాలిక డ్రైవర్​పై దాడి

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన సాయి... టీఎస్ ఆర్టీసీలో తాత్కాలిక డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. విధుల్లో ఉన్న అతను తమ వైపు చేయి చూపిస్తూ... అసభ్యకరంగా ప్రవర్తించాడని కొందరు మహిళా కండక్టర్లు ఆరోపించారు. మణుగూరు డిపోలో ఆందోళన చేస్తున్న కార్మికులకు విషయం చెప్పారు. ఆర్టీసీ కార్మికులు.. సాయిని అసభ్య పదజాలంతో దూషిస్తూ... దాడికి దిగారు. సమాచారం తెలుసుకున్న సీఐ సంఘటనాస్థలికి చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. మహిళా కండక్టర్లు, తాత్కాలిక డ్రైవర్​ పోలీస్​స్టేషన్​లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

Intro:అసభ్యంగా ప్రవర్తించిన తాత్కాలిక డ్రైవర్ పై ఆర్టీసీ కార్మికుల దాడిBody:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
మణుగూరు.
మణుగూరు ఆర్టీసీ డిపో పరిధిలో తాత్కాలిక డ్రైవర్ గా పని చేస్తున్న వాల్లెపు సాయి ఆర్టీసీ మహిళా కండక్టర్ ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అతని పై ఆర్టీసీ కార్మికుల దాడి చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి ఆర్టీసీ కార్మికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరు పట్టణానికి చెందిన సాయి కొద్దిరోజులుగా డిపో లో తాత్కాలిక డ్రైవరు గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని డిపో లోకి వెళుతున్న క్రమంలో డిపో ఎదుట నిరసన దీక్ష వద్ద కూర్చొని ఉన్న కొంత మంది మహిళా కండక్టర్ ల పట్ల బస్సులో నుంచి సాయి తన చేతిని చూపిస్తే అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో మహిళా కండక్టర్ వెంటనే అక్కడ విధులు నిర్వర్తించే ఎస్సై కి విషయాన్ని తెలిపారు.Conclusion:కొద్ది సమయం తర్వాత డిపో నుంచి బయటకు వచ్చిన సాయిని మహిళా కండక్టర్ లు ఎందుకలా ప్రవర్తించావని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది . ఆ సమయంలో ఆర్టీసీ కార్మికులు సాయి పై దాడి చేశారు . విషయం తెలుసుకున్న సిఐ శుకూర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనపై ఆర్టీసీ మహిళా కండక్టర్లు, త్కాలిక డ్రైవరు, ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.