ETV Bharat / city

వైకాపా రివర్స్ పాలనపై నిరసన...తెదేపా నేతల రివర్స్​ నడక

author img

By

Published : Dec 16, 2019, 10:33 AM IST

రాష్ట్రంలో రివర్స్ పాలన నడుస్తోందని.. అసెంబ్లీకి రివర్స్​లో నడిచి వెళ్లి నిరసన తెలిపారు తెదేపా నేతలు. ఇష్టారాగ్యంగా వ్యవహరిస్తున్నారని నిరసనలో పాల్గొన్న తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైకాపా చర్యల వలన పెట్టుబడులు వెనక్కిపోతున్నాయని విమర్శించారు.

tdp-protest-on-reverse-tendering
వైకాపా రివర్స్ పాలనపై నిరసన...తెదేపా నేతల రివర్స్​ నడక
అసెంబ్లీకి రివర్స్ నడకలో వెళ్తోన్న తెదేపా నేతలు
సీఎం జగన్ చర్యలతో రాష్ట్రం అధోగతిపాలైందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. టెండర్లన్నీ రిజర్వ్ చేసుకుని రివర్స్ అంటున్నారని మండిపడ్డారు. 2 లక్షల కోట్ల విలువైన అమరావతిని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి.. విదేశీ పెట్టుబడులు రాని దుస్థితి తీసుకువచ్చారన్న చంద్రబాబు... ఉన్న పరిశ్రమలు పారిపోయే స్థితి ఉందని ఆరోపించారు. రివర్స్ పాలన- తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి అంశంపై తెదేపా నిరసన ర్యాలీ చేసింది. చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టిన నేతలు వెనక్కి నడుస్తూ తమ నిరసన తెలిపారు. చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి రివర్స్ వాక్ చేస్తూ వెళ్లారు.

ఇదీ చదవండి :

మన కాలపు మహనీయుడు

అసెంబ్లీకి రివర్స్ నడకలో వెళ్తోన్న తెదేపా నేతలు
సీఎం జగన్ చర్యలతో రాష్ట్రం అధోగతిపాలైందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. టెండర్లన్నీ రిజర్వ్ చేసుకుని రివర్స్ అంటున్నారని మండిపడ్డారు. 2 లక్షల కోట్ల విలువైన అమరావతిని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి.. విదేశీ పెట్టుబడులు రాని దుస్థితి తీసుకువచ్చారన్న చంద్రబాబు... ఉన్న పరిశ్రమలు పారిపోయే స్థితి ఉందని ఆరోపించారు. రివర్స్ పాలన- తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి అంశంపై తెదేపా నిరసన ర్యాలీ చేసింది. చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టిన నేతలు వెనక్కి నడుస్తూ తమ నిరసన తెలిపారు. చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి రివర్స్ వాక్ చేస్తూ వెళ్లారు.

ఇదీ చదవండి :

మన కాలపు మహనీయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.