ETV Bharat / city

అందుకే మూడు రాజధానుల నిర్ణయం: సభాపతి తమ్మినేని

author img

By

Published : Dec 22, 2019, 5:08 PM IST

Updated : Dec 22, 2019, 6:01 PM IST

రాజధానిపై ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతికి వెళ్తుంటే ఎడారికి వెళ్తున్నట్లు ఉందన్నారు. ఆర్థిక అసమానతలను తొలగించాలంటే మూడు రాజధానుల అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

తమ్మినేని సీతారాం
తమ్మినేని సీతారాం
మీడియాతో మాట్లాడుతున్న స్పీకర్ తమ్మినేని

రాజధాని అమరావతికి వెళ్లాలంటే రాజస్థాన్‌ ఎడారికి వెళ్తున్నట్లు ఉందని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. మిగిలిన వారు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేకపోయారని వెల్లడించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. ‘‘అందరూ గర్వించేలా రాజధాని ప్రాంతం ఉండాలి... ప్రతి ఒక్కరూ రాజధానిని చూసి ఇది నాది అనే భావన వ్యక్తం చేయాలి... అమరావతిలో ఆ పరిస్థితి లేదు... మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. విమర్శలు చేసేవాళ్లు ముందుగా వాస్తవాలను తెలుసుకోవాలి. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో జరిగిన అవినీతిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటారు’’ అని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ సమావేశాలు ఏ మాత్రం ఆహ్లాదకరంగా జరగడం లేదని.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తమ్మినేని అన్నారు. అసెంబ్లీలో సభ్యులు వాడుతున్న భాష విషయంలో అందరూ బాధ్యులేనన్నారు. ఈ సంప్రదాయాలకు ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపులను ఇబ్బడిముబ్బడిగా ప్రోత్సహించిన గత ప్రభుత్వానికి ప్రజలు తమ తీర్పుతో గుణపాఠం చెప్పారన్నారు.

ఇదీ చదవండి:రైతులకు మద్దతుగా.. రేపటినుంచి కృష్ణాజిల్లాలో ఆందోళనలు

మీడియాతో మాట్లాడుతున్న స్పీకర్ తమ్మినేని

రాజధాని అమరావతికి వెళ్లాలంటే రాజస్థాన్‌ ఎడారికి వెళ్తున్నట్లు ఉందని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. మిగిలిన వారు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేకపోయారని వెల్లడించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. ‘‘అందరూ గర్వించేలా రాజధాని ప్రాంతం ఉండాలి... ప్రతి ఒక్కరూ రాజధానిని చూసి ఇది నాది అనే భావన వ్యక్తం చేయాలి... అమరావతిలో ఆ పరిస్థితి లేదు... మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. విమర్శలు చేసేవాళ్లు ముందుగా వాస్తవాలను తెలుసుకోవాలి. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో జరిగిన అవినీతిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటారు’’ అని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ సమావేశాలు ఏ మాత్రం ఆహ్లాదకరంగా జరగడం లేదని.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తమ్మినేని అన్నారు. అసెంబ్లీలో సభ్యులు వాడుతున్న భాష విషయంలో అందరూ బాధ్యులేనన్నారు. ఈ సంప్రదాయాలకు ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపులను ఇబ్బడిముబ్బడిగా ప్రోత్సహించిన గత ప్రభుత్వానికి ప్రజలు తమ తీర్పుతో గుణపాఠం చెప్పారన్నారు.

ఇదీ చదవండి:రైతులకు మద్దతుగా.. రేపటినుంచి కృష్ణాజిల్లాలో ఆందోళనలు

Intro:Body:Conclusion:
Last Updated : Dec 22, 2019, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.